Dowleswaram Barrage : ధవళేశ్వరం బ్యారేజీ వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గంటకు ఒక పాయింట్ వంతున తగ్గుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువగా కొనసాగిన గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతుంది. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 11 పాయింట్ 5 అడుగులు వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను 5 మీటర్ల ఎత్తు వరకు ఎత్తి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుండి 9 లక్షల 30 వేల క్యూసెక్కులు వరదనీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గత రాత్రి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువగా నీటిమట్టం 11 పాయింట్ 7 అడుగులకు చేరి సుమారు 5 గంటల పాటు నిలకడగా వరద ఉధృతి కొనసాగింది. అనంతరం ఈ ఉదయం 6 గంటల నుండి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీనితో గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఊపీరిపీల్చుకుంటున్నారు. గోదావరి వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు
Also Read : Krithi Shetty: చినుకునైనా కాకపోతిని నిన్ను తాకగా.. వర్షంలో బుల్లి డ్రెస్ లో బేబమ్మ
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఇదిలా ఉంటే.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమంగా వరద పెరుగుతోంది. సముద్రంలోకి 11,025 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. అధికారుల.. కాలువలకు 5,513 క్యూసెక్కుల విడుదల చేయగా.. మొత్తం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 16,538 క్యూసెక్కులు.. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులుగా ఉంది. 15 గేట్లు ఒక అడుగుమేర అధికారులు ఎత్తారు. సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీకి పట్టిసీమ ఔట్ ఫ్లో చేరనుంది. మున్నేరు వద్ద కూడా వరద ప్రవాహం తగ్గుతూ వస్తోంది. పులిచింతల వద్ద ఔట్ ఫ్లో లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీ కి వరద సాధారణంగా ఉంది.
Also Read : North Korea: మళ్లీ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా.. కొనసాగుతున్న ఉద్రిక్తతలు
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..