UNFPA: రాబోయే దశాబ్దాల్లో యువభారతం వృద్ధాప్య సమాజంగా మారుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Young India Will Turn Into Rapidly Ageing Society In Coming Decades Says UNFPA Report: భారతదేశంలో వృద్ధుల జనాభా అపూర్వమైన రేటుతో విస్తరిస్తోంది. శతాబ్దపు మధ్య నాటికి పిల్లల జనాభాను అధిగమిస్తుందని కొత్త యూఎన్ఎఫ్పీఏ నివేదిక పేర్కొంది,. రాబోయే దశాబ్దాల్లో యువ భారతదేశం వేగంగా వృద్ధాప్య సమాజంగా మారుతుందని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక యుక్తవయస్కులు, యువకులు ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. జాతీయ స్థాయిలో యూఎన్ఎఫ్పీఏ ‘ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023’ ప్రకారం.. వృద్ధుల (60+ సంవత్సరాలు) జనాభా వాటా 2021లో 10.1 శాతం నుండి 2036లో 15 శాతానికి, 2050లో 20.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేయబడింది.
Also Read: Albert Einstein: ఐన్స్టీన్ సంతకంతో కూడిన ప్రతులకు వేలంలో భారీ ధర..
Also Read
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
“శతాబ్ది చివరి నాటికి దేశంలోని మొత్తం జనాభాలో వృద్ధులు 36 శాతానికి పైగా ఉంటారు. 2010 నుంచి వృద్ధుల జనాభా అధికంగా పెరుగుతూ వచ్చింది. అలాగే 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో క్షీణత వేగాన్ని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో వృద్ధాప్య సమాజం పెరుగుతుంది.” అని నివేదిక పేర్కొంది. భారతదేశంలో వృద్ధుల జనాభా అపూర్వమైన స్థాయిలో విస్తరిస్తోంది. శతాబ్దం మధ్య నాటికి పిల్లల జనాభాను అధిగమిస్తుందని నివేదిక సూచించింది. “2050కి నాలుగు సంవత్సరాల ముందు, భారతదేశంలోని వృద్ధుల జనాభా పరిమాణం 0-14 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా పరిమాణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ సమయానికి, 15-59 సంవత్సరాల జనాభా వాటా కూడా తగ్గుతుంది. నిస్సందేహంగా, సాపేక్షంగా యువ భారతదేశం రాబోయే దశాబ్దాలలో వేగంగా వృద్ధాప్య సమాజంగా మారుతుంది, ”అని పేర్కొంది.
దక్షిణ ప్రాంతంలోని చాలా రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు 2021లో జాతీయ సగటు కంటే వృద్ధుల జనాభాలో ఎక్కువ వాటాను నివేదించాయి. ఈ అంతరం 2036 నాటికి పెరుగుతుందని అంచనా వేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి అధిక సంతానోత్పత్తి రేట్లు, జనాభా పరివర్తనలో వెనుకబడి ఉన్న రాష్ట్రాలు 2021-2036 మధ్య వృద్ధుల జనాభాలో పెరుగుదలను చూస్తాయని భావిస్తున్నప్పటికీ, ఈ స్థాయి భారతీయ సగటు కంటే తక్కువగానే ఉంటుందని నివేదిక పేర్కొంది. 1961 నుంచి భారతదేశం వృద్ధుల జనాభాలో మధ్యస్థం నుంచి అధిక దశాబ్ధ వృద్ధిని చూసింది. స్పష్టంగా 2001 కంటే ముందు ఈ వేగం నెమ్మదిగా ఉంది. అయితే రాబోయే దశాబ్దాల్లో అది గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది.
Also Read: Chicken Heating : చికెన్ ను పదే పదే వేడి చేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా..
2021 జనాభా అంచనాల ప్రకారం భారతదేశంలో ప్రతి 100 మంది పిల్లలకు 39 మంది వృద్ధులు ఉన్నారని నివేదిక పేర్కొంది. వృద్ధుల జనాభాలో ఎక్కువ వాటా ఉన్న రాష్ట్రాలు (దక్షిణ భారతదేశంలో ఉన్నవి) కూడా వృద్ధాప్య సూచికకు అధిక స్కోర్ను చూపుతాయి. సంతానోత్పత్తి క్షీణతను సూచిస్తుంది, ఇది పిల్లలతో పోలిస్తే వృద్ధుల సంఖ్య పెరగడానికి దారితీస్తుంది. “దక్షిణ, పశ్చిమ భారతదేశంతో పోలిస్తే మధ్య, ఈశాన్య ప్రాంతాలు వృద్ధాప్య సూచిక ద్వారా సూచించబడిన యువ రాష్ట్రాల సమూహాన్ని కలిగి ఉన్నాయి” అని ఈ నివేదిక తెలిపింది. వృద్ధాప్య సూచిక 100 మంది పిల్లల జనాభాకు (15 ఏళ్లలోపు) వృద్ధుల (60+ సంవత్సరాలు) సంఖ్యను కొలుస్తుంది. జనాభా వయస్సు పెరిగే కొద్దీ ఇండెక్స్ స్కోర్ పెరుగుతుంది. జనాభా అంచనాలు 2021లో భారతదేశంలోని 100 మంది పనిచేసే వయస్సు వ్యక్తులకు 16 మంది వృద్ధులు ఉన్నారని, ప్రాంతాల వారీగా గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని UNFPA తెలిపింది.
తాజావార్తలు
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
-
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!