Donations: రాజకీయ పార్టీలనూ తాకిన కొవిడ్ దెబ్బ.. 41.49శాతం తగ్గిన విరాళాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలను వణికించిన కొవిడ్ మహమ్మారి ప్రభావం రాజకీయ పార్టీలను కూడా తాకింది. కొవిడ్ కారణంగా పార్టీలకు వచ్చే విరాళాలకు భారీగా కోతపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ పార్టీలకు అందిన వివరాలతో విడుదలైన ఏడీఆర్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు అందిన విరాళాలు ₹420 కోట్లకు పైగా తగ్గాయని, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 41.49 శాతం తగ్గాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ నివేదికలో వెల్లడించింది. కొవిడ్ మొదటి వేవ్ 2020 మార్చి చివరి వారంలో అంటే ఆర్థిక ఏడాది ప్రారంభం ముందే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించేందుకు కారణమైంది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం.. భారతీయ జనతా పార్టీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785.77 కోట్ల విరాళాలు రాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.477.54కోట్లకు తగ్గింది. అంటే 39.23శాతం మేర విరాళాలు తగ్గాయి. ఇక, కాంగ్రెస్ పార్టీకి 2019-20లో రూ.139.01కోట్ల విరాళాలు రాగా.. కరోనా సమయంలో కేవలం రూ.74.52కోట్లు మాత్రమే సమకూరాయి.
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
Loksabha Speaker: ఏ పదాన్ని నిషేధించలేదు.. తప్పుడు ప్రచారాలు చేయొద్దు..
అత్యధికంగా దిల్లీ నుంచి రూ. 246కోట్లు జాతీయ పార్టీలకు విరాళంగా అందాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి రూ.71.68కోట్లు, గుజరాత్ నుంచి రూ.47 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఎనిమిది జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఇక ఎనిమిది గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో 80శాతానికి పైగా అంటే.. రూ.480.655కోట్లు కార్పొరేట్, బిజినెస్ రంగాల నుంచి వచ్చినవే. మరో రూ.111.65 కోట్లను 2,258 మంది వ్యక్తులు విరాళంగా ఇచ్చినట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. అధికార బీజేపీకి కార్పొరేట్, వ్యాపార రంగం నుంచి సుమారు 11 వందల విరాళాలు అందగా.. వీటి విలువ రూ. 416.79 కోట్లుగా ఉంది. విపక్ష కాంగ్రెస్కు ఆయా వర్గాల నుంచి 146 విరాళాలు అందగా.. వాటి విలువ 38.63 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
.
- Tags
- ADR report
- bjp
- BSP
- congress
- corona virus
తాజావార్తలు
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!