Health Tips: ఈ ఆకుకూరను మగవాళ్లు తింటే ఎంత ప్రయోజనం తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకుకూరలు తింటే అందరి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికి తెలుసు. ఆకుకూరలు రోజు తింటే అనేక అనారోగ్య సమస్యల బారినుంచి తప్పించుకోవచ్చు. అందుకే డాక్టర్లు ఎక్కువగా ఆకు కూరలు తినాలని సూచిస్తారు. అయితే ఆకుకూరల అన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరల రకమైన పొన్నగంటి కూరలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలుంటాయి. ఇవి ఎక్కువగా పురుషులకు ఎంతో సహాయపడుతాయి. ఈ ఆకుకూరతో పలు రకాల సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: IND vs NZ: 273కు న్యూజిలాండ్ ఆలౌట్.. 5 వికెట్లతో చెలరేగిన షమీ
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
పొన్నగంటి ఆకులో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇందులో బి6, సి, ఏ విటమిన్లతో పాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ ఆకుకూర తింటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. అంతేకాకుండా గుండెకు, మెదడుకు అత్యంత ఉత్సహాన్ని ఇస్తుంది. బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి. పొన్నగంటి కూరలో ఎముకల ఎదుగుదలకు లభించే కాల్షియం ఎంతో దోహదపడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటివాటిని కూడా ఈ ఆకు కూర దూరం చేస్తుంది. బరువును నియంత్రణ, క్యాన్సర్ కారకాలను నయం చేస్తుంది.
Read Also: Iran: మహ్సా అమిని మరణాన్ని కవర్ చేసిన ఇద్దరు మహిళ జర్నలిస్టులకు జైలు శిక్ష..
పొన్నగంటి కూర తినడం ద్వారా మగవారికి కావల్సిన శక్తి సమకూరుతుంది. ఇందులో లైంగిక సామర్థ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి. ఈ ఆకుకూర జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది. పొన్నగంటి కూర ఒక టేబుల్ స్పూన్ రసాన్ని వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలింగా వేధించే దగ్గు, ఆస్తమా ఇక ఉండదు. అంతేకాకుండా.. నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి ఇదొక మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ ఆకు కూర తినడం వల్ల సన్నగా ఉండేవారు బరువు పెరుగుతారు. కందిపప్పు, నెయ్యితో కూరను వండుకోవాలి. అంతేకాకుండా పొన్నగంటి ఆకును ఉడికించి మిరియాల పొడి, ఉప్పు కలిపి తింటే బరువు తగ్గుతారు. కంటి కలకలు, కురుపులు కూడా దీనితో చెక్ పెట్టవచ్చు. పొన్నగంటి కూర తాజా ఆకులను కళ్లమీద కొంచెం సమయం ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా.. వెన్ను నొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. నరాల్లో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది.
తాజావార్తలు
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!