Iran: మహ్సా అమిని మరణాన్ని కవర్ చేసిన ఇద్దరు మహిళ జర్నలిస్టులకు జైలు శిక్ష..
Iran: గతేడాది ఇరాన్ దేశాన్ని మహ్స అమిని అనే యువతి మరణం ఓ కుదుపుకుదిపేసింది. మత సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హిజాబ్ సరిగా ధరించలేదని కుర్దిష్ యువతి అయిన మహ్సా అమినిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసి కొట్టడంతో ఆమె మరణించింది. ఈ మరణం ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ ఉద్యమానికి కారణమైంది. మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అక్కడి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరిగాయి.
ఇదిలా ఉంటే మహ్సా అమిని మరణ వార్తల్ని కవర్ చేసినందుకు ఇరాన్ లోని ఒక న్యాయస్థానం ఇద్దరు మహిళా జర్నలిస్టుకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై 20 రోజుల్లో అప్పీల్ కి వెళ్లవచ్చు. అమిని హిజాబ్ వదులగా ధరించినందుకు చనిపోయారని జర్నలిస్టు నిలౌఫర్ హమేదీ, ఆమె అంత్యక్రియల గురించి రాసిన ఇలాహెహ్ మొహమ్మదీకి వరసగా ఏడు, ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు న్యాయవార్తా వెబ్సైట్ మిజాన్ నివేదించింది.
Also Read
- Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
- Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా 'మెగా' దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
- Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
- Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
Read Also: Azam Khan: “మేము ఎన్కౌంటర్ కావొచ్చేమో”.. యూపీ నేత ఆజం ఖాన్ కీలక వ్యాఖ్యలు..
అమెరికాకు సహకరించడం, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కుమ్మక్కవ్వడం, వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఇద్దరు జర్నలిస్టులపై అభియోగాలు మోపబడ్డాయి. వారిద్దరిని సెప్టెంబర్ 2022లో అదుపులోకి తీసుకున్నారు. మే నెలలో ఐక్యరాజ్యసమితి ఇద్దరు జర్నలిస్టులకు వారి జవాబుదారీతనం, నిజాయితీలకు బహుమతి ప్రదానం చేసింది.
మహ్సా అమిని మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. లక్షల మంది రోడ్లపైకి వచ్చి హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ మహిళలు నిరసన తెలిపారు. ఈ ఆందోళనల్లో ప్రభుత్వ అధికారులు కూడా మరణించారు. ప్రభుత్వం ఈ నిరసనలను అణిచివేసిన తర్వాత ఇందులో పాల్గొన్న కొంతమందిని ఉరితీసి చంపింది. మరికొంత మందిని జైళ్లలో ఉంచింది. దాదాపు 100 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేసింది. ఈ ఉద్యమం వల్ల 529 మంది మరణించారు. 19,700 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!