World Cup Commentators: వరల్డ్ కప్ లో ఎంత మంది కామెంటేటర్లో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ కోసం ఎంత మంది వ్యాఖ్యతలు ఉండబోతున్నారో తెలుసా.. కామెంటేటర్స్ కోసం అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం ప్రత్యేక సన్నాహాలు చేసింది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో 120 మంది వ్యాఖ్యాతలు 9 వేర్వేరు భాషల్లో వ్యాఖ్యానించనున్నారు. అందులో క్రికెట్ దిగ్గజాలు.. రికీ పాంటింగ్, ఇయాన్ మోర్గాన్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, షేన్ వాట్సన్, వకార్ యూనిస్ వంటి వారు ప్రపంచకప్ మ్యాచ్లకు వ్యాఖ్యానించనున్నారు. అంతే కాకుండా.. క్రికెట్ అభిమానుల కోసం హిందీ, ఇంగ్లీషుతో సహా 9 విభిన్న భాషలలో ప్రపంచ కప్ మ్యాచ్లను ఆస్వాదించనున్నారు. మరాఠీలో కూడా ప్రపంచ కప్ మ్యాచ్ల వ్యాఖ్యానం ఉండబోతుంది. దాంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయం వంటి భాషల్లో వ్యాఖ్యానం ఉండనుంది.
Read Also: Electric Car Catches Fire: ఎలక్ట్రిక్ కారులో మంటలు.. బెంగళూర్లో ఘటన..
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఇక క్రికెట్ దిగ్గజాలతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ కూడా వ్యాఖ్యాతగా కనిపించనుంది. ప్రపంచకప్లో గ్రేస్ హేడెన్ కాకుండా మొత్తం 8 మంది వ్యాఖ్యాతలు ఉండబోతున్నారు. అంతే కాకుండా.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా వీడియో కాల్ ద్వారా వ్యాఖ్యాన జట్టులో భాగం కానున్నారు. అక్టోబర్ 4న ప్రపంచకప్ ప్రారంభోత్సవం జరగనుండడం గమనార్హం. ఆ తర్వాత తొలి మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. ఇక.. ఈ టోర్నీ టైటిల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
Read Also: Rajinikanth: సంక్రాంతి బరిలో ‘లాల్ సలాం’.. వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 8న భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత భారత జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్తో ఆడుతుంది. అక్టోబరు 11న ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 14న పాకిస్థాన్తో భారత జట్టు బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..