World Cup Commentators: వరల్డ్ కప్ లో ఎంత మంది కామెంటేటర్లో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ కోసం ఎంత మంది వ్యాఖ్యతలు ఉండబోతున్నారో తెలుసా.. కామెంటేటర్స్ కోసం అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం ప్రత్యేక సన్నాహాలు చేసింది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో 120 మంది వ్యాఖ్యాతలు 9 వేర్వేరు భాషల్లో వ్యాఖ్యానించనున్నారు. అందులో క్రికెట్ దిగ్గజాలు.. రికీ పాంటింగ్, ఇయాన్ మోర్గాన్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, షేన్ వాట్సన్, వకార్ యూనిస్ వంటి వారు ప్రపంచకప్ మ్యాచ్లకు వ్యాఖ్యానించనున్నారు. అంతే కాకుండా.. క్రికెట్ అభిమానుల కోసం హిందీ, ఇంగ్లీషుతో సహా 9 విభిన్న భాషలలో ప్రపంచ కప్ మ్యాచ్లను ఆస్వాదించనున్నారు. మరాఠీలో కూడా ప్రపంచ కప్ మ్యాచ్ల వ్యాఖ్యానం ఉండబోతుంది. దాంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయం వంటి భాషల్లో వ్యాఖ్యానం ఉండనుంది.
Read Also: Electric Car Catches Fire: ఎలక్ట్రిక్ కారులో మంటలు.. బెంగళూర్లో ఘటన..
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
ఇక క్రికెట్ దిగ్గజాలతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ కూడా వ్యాఖ్యాతగా కనిపించనుంది. ప్రపంచకప్లో గ్రేస్ హేడెన్ కాకుండా మొత్తం 8 మంది వ్యాఖ్యాతలు ఉండబోతున్నారు. అంతే కాకుండా.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా వీడియో కాల్ ద్వారా వ్యాఖ్యాన జట్టులో భాగం కానున్నారు. అక్టోబర్ 4న ప్రపంచకప్ ప్రారంభోత్సవం జరగనుండడం గమనార్హం. ఆ తర్వాత తొలి మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. ఇక.. ఈ టోర్నీ టైటిల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
Read Also: Rajinikanth: సంక్రాంతి బరిలో ‘లాల్ సలాం’.. వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 8న భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత భారత జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్తో ఆడుతుంది. అక్టోబరు 11న ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 14న పాకిస్థాన్తో భారత జట్టు బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..