World Cup Commentators: వరల్డ్ కప్ లో ఎంత మంది కామెంటేటర్లో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ కోసం ఎంత మంది వ్యాఖ్యతలు ఉండబోతున్నారో తెలుసా.. కామెంటేటర్స్ కోసం అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం ప్రత్యేక సన్నాహాలు చేసింది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో 120 మంది వ్యాఖ్యాతలు 9 వేర్వేరు భాషల్లో వ్యాఖ్యానించనున్నారు. అందులో క్రికెట్ దిగ్గజాలు.. రికీ పాంటింగ్, ఇయాన్ మోర్గాన్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, షేన్ వాట్సన్, వకార్ యూనిస్ వంటి వారు ప్రపంచకప్ మ్యాచ్లకు వ్యాఖ్యానించనున్నారు. అంతే కాకుండా.. క్రికెట్ అభిమానుల కోసం హిందీ, ఇంగ్లీషుతో సహా 9 విభిన్న భాషలలో ప్రపంచ కప్ మ్యాచ్లను ఆస్వాదించనున్నారు. మరాఠీలో కూడా ప్రపంచ కప్ మ్యాచ్ల వ్యాఖ్యానం ఉండబోతుంది. దాంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయం వంటి భాషల్లో వ్యాఖ్యానం ఉండనుంది.
Read Also: Electric Car Catches Fire: ఎలక్ట్రిక్ కారులో మంటలు.. బెంగళూర్లో ఘటన..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఇక క్రికెట్ దిగ్గజాలతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ కూడా వ్యాఖ్యాతగా కనిపించనుంది. ప్రపంచకప్లో గ్రేస్ హేడెన్ కాకుండా మొత్తం 8 మంది వ్యాఖ్యాతలు ఉండబోతున్నారు. అంతే కాకుండా.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా వీడియో కాల్ ద్వారా వ్యాఖ్యాన జట్టులో భాగం కానున్నారు. అక్టోబర్ 4న ప్రపంచకప్ ప్రారంభోత్సవం జరగనుండడం గమనార్హం. ఆ తర్వాత తొలి మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. ఇక.. ఈ టోర్నీ టైటిల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
Read Also: Rajinikanth: సంక్రాంతి బరిలో ‘లాల్ సలాం’.. వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 8న భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత భారత జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్తో ఆడుతుంది. అక్టోబరు 11న ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 14న పాకిస్థాన్తో భారత జట్టు బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!