Liquor ATM: ఎనీ టైం మందు.. ఏటీఎం తీసుకొచ్చిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏటీఎంకు కొత్త నిర్వచణం చెబుతూ ఎనీ టైం మందు అంటూ ఓ సినిమాలో ఓ యాక్టర్ డైలాగ్ చెప్పిన విషయం గుర్తుందా? అది ఇప్పుడు నిజమైపోయింది.. అందేంటి? అదేలా ? అంటారా? అదేనండి బాబు.. ఇప్పుడు ఎనీ టైం మందు (ఏటీఎం)లు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.. ఏటీఎంలో కార్డు పెట్టి కావాల్సిన మొత్తాన్ని కొడితే క్యాష్ వచ్చినట్టుగానే.. ఏ లిక్కర్ కావాలో.. దానికి సరపడి డబ్బులు వేస్తే.. ఆ ఏటీఎం నుంచి మీకు నచ్చిన మందు వస్తుందన్నమాట.. ఇప్పుడు చెన్నైలో ఈ ఎనీ టైం మందు మిషన్ ఏర్పాటు చేశారు.
కోయంబేడులోని ఓ మాల్ వద్ద తమిళనాడు ప్రభుత్వం ATM మందు మిషన్ ఏర్పాటు చేసింది.. నాలుగు ప్రాంతాలలో ATM తరహాలో మిషన్ ఏర్పాటు చేసింది తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్.. ఈ మిషన్ దగ్గరకు వెళ్లి.. అందులో చూపించే.. బ్రాండ్లను నచ్చిన బ్రాండ్ను ఎంపికచేసుకునే వెసులుబాటు ఉంది.. ఇక, ఆ బ్రాండ్కు ఎంత మొత్తం చెల్లించాలో చూపిస్తుంది.. ఆ పేమెంట్ డిజిటల్ రూపంలో చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత మీరు ఎంపిక చేసుకున్న లిక్కర్.. డెలివరీ చేస్తుంది ఆ మిషన్.. అయితే మద్యం మిషన్ ఏర్పాటుపై బీజేపీ నేత, సినీనటి ఖుష్బూ సెటైర్లు వేశారు.. ప్రజలను మద్యానికి బానిసలుగా ఉంచడానికి డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన ఐడియా సూపర్గా ఉందండీ అంటూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేశారు. మరోవైపు, మద్యం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయాని డీఎంకే ఎంపీ కనిమోళి స్వయంగా అంగీకరించారు.. ఇలాంటి వాటి వల్ల తమిళ యువత ఆరోగ్యం నాశనం అవుతుందన్నారు. ఏదేమైనా.. ఎన్ని విమర్శలు ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తున్న విషయం విదితమే.
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
కాగా, ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం మార్కెటింగ్ మరియు విక్రయాల సంస్థ TASMAC అమ్మకాలను పెంచడానికి మరో ప్రయత్నంలో, DMK ప్రభుత్వం చెన్నైలో ఆటోమేటెడ్ మద్యం యంత్రాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడు ప్రభుత్వ మద్యం విక్రయ సంస్థ అయిన టాస్మాక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.50,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పిటిఆర్ పళనివేల్ త్యాగరాజన్ తమిళనాడు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు, ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.5000 కోట్లు పెరిగింది. దీని ప్రకారం, తమిళనాడులో టాస్మాక్ ద్వారా మద్యం అమ్మకాలు పెరిగేలా డీఎంకే ప్రభుత్వం ప్రభుత్వ నిబంధనలలో మార్పులు తీసుకువస్తోంది. సమావేశ మందిరాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, బాంకెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాలు, గృహ కార్యక్రమాల్లో మద్యం సేవించేందుకు ప్రత్యేక లైసెన్స్ మంజూరు చేస్తూ డీఎంకే ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
This is a dangerous trend in a state that is already having enough problems with Tasmac admitted by my good friend MP @KanimozhiDMK avl herself. Now, this innovation in liquor delivery is bound to further ruin the health of youngsters who visit the mall. Vidiyal government seems… pic.twitter.com/jSHKGXSkQw
— KhushbuSundar (@khushsundar) April 28, 2023
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!