Parthasarathi: రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..ఒక్క రోజులో దాదాపు 95శాతం
- సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పంపిణీ పూర్తి
- 61.60825 మందికి పెన్షన్ల నగదు అందజేత
- 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో పంపిణీ చేపట్టిన ప్రభుత్వ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగిందని సమాచార శాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసిందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. “ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం.. సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పంపిణీ పూర్తి చేశాం. 61,60,825 మందికి పెన్షన్ల నగదు అందజేశాం. 4,159 కోట్ల రూపాయల పెన్షన్ మొత్తం లబ్ధిదారులకు అందాయి. 2.65 లక్షల మంది వాలంటేర్ లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పెన్షన్ పంపిణీ జరగలేదు. 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో రికార్డు స్థాయిలో 12 గంటల వ్యవధి లో పెన్షన్లు పంపిణీ చేపట్టాం. గత ప్రభుత్వ హయంలో 2.65 మంది వాలంటీర్ లు ఉన్నా ఒక్క రోజులో కేవలం 88 శాతం మాత్రమే పంపిణీ చేశారు. సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు , ఉద్యోగులు ఎంత అద్భుతం గా పని చేస్తారో అంటూ నిరూపణ అయ్యిందని సీఎం చంద్రబాబు ప్రసంశలు కురిపించారు. పెన్షన్ పంపిణీ లో పాల్గొన్న అధికారుల నుంచి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల అందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.” అని పేర్కొన్నారు.
READ MORE: Bharateeyudu 2 : భారతీయుడు 2 నుండి వావ్.. అనేలా “క్యాలెండర్ సాంగ్”
Also Read
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
ఎక్కడకి వెళ్లినా పెన్షన్ దారులు ఆనందంతో పండుగ చేసుకున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. “చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా నాలుగు వేలు పెన్షన్, బకాయి మూడువేలు కలిపి ఏడువేలు ఇచ్చాం. 28 కేటగిరీల్లో 4408 కోట్లు నేడు పంపిణీ చేశాం. గత ప్రభుత్వం ఐదేళ్లకు వెయ్యి పెంచితే.. చంద్రబాబు 17 రోజుల పాలనలో పెంచారు. గతంలో 200 నుంచి2000 పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబు దే. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్నివిధాలా దివాళా తీయించింది. అన్ని వ్యవస్థ లను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు నిబద్ధత తో పని చేశారు.
వారి కష్టం వల్ల రాత్రి ఎనిమిది వరకు 95 శాతం నమోదు కావడం ఒక చరిత్ర. చంద్రబాబు పనితీరుకు ఈ పెన్షన్ ల పంపిణీ ఒక నిదర్శనం. చంద్రబాబు అనుభవంతో ఎపి ని అన్ని విధాలా గాడిలో పెట్టి.. అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారు.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
-
Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
-
UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
-
IPL 2026 Final: ఆర్సీబీ vs జీటీ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఫైనల్కు డిసైడ్ చేసే మూడు ప్లేయర్స్ బ్యాటిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..