T20 World Cup 2024 Final : వామ్మో..మ్యాచ్ రోజు జనాలు తెగ తినేశారు..తాగేశారు..
- కిక్కిరిసిన రెస్టారెంట్లు.. బార్లు
- 40% నుంచి 50% వరకు పెరిగిన విక్రయాలు..ఆదాయాలు
- ఆహారం పానీయాల కోసం భారీగా ఆర్డర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించి విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయతీరాలకు చేర్చారు. తాజాగా మ్యాచ్ రోజు జరిగిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జనాలు ఫుల్ గా తినడం, తాగడం చేశారు. దీంతో ఒక్కసారిగా హోటళ్లు, బార్ల గిరాకీ పెరిగింది. ఇష్టమైన ఆహార పదార్థాలు తింటూ ఫైనల్ మ్యాచ్ను ఆస్వాదించారు. కప్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునేందుకు ప్రజలు ఆహారం & పానీయాల కోసం అమితంగా ఆర్డర్లు పెట్టారు. దీంతో రెస్టారెంట్లతో పాటు శీఘ్ర వాణిజ్య సంస్థల విక్రయాలు, ఆదాయాలు 40% నుంచి 50% వరకు పెరిగాయి. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలోని విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్ పూర్తిగా నిండిపోయింది. పూర్తి సామర్థ్యంతో అక్కడ బిజినెస్ జరిగింది. ది బీర్ కేఫ్ రెస్టారెంట్ ప్రారంభమై 12 సంవత్సరాలు గడిచాయి. గతంలో ఎన్నడూ లేనంత “సింగిల్ డే రెవెన్యూ”ను ఆ రెస్టారెంట్ చైన్ సాధించింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో బార్లు కేఫ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు నిండిపోయాయి. బిజినెస్ మహా జోరుగా సాగింది. కొందరు వ్యాపారులు చెప్పిన ప్రకారం… వాళ్ల వ్యాపార ప్రాంగణాల్లో అంత పెద్ద జన సమూహాన్ని చూడడం అదే తొలిసారి.
READ MORE: Sunaina : దుబాయ్ యూట్యూబర్ తో పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్.. బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..
Also Read
- Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ఫిన్టెక్ స్టార్టప్ ‘సింపుల్’ (Simpl) రిపోర్ట్ ప్రకారం.. క్రికెట్ వరల్డ్ కప్ T20 ఫైనల్ మ్యాచ్ సమయంలో ఈ ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదార్లు చేసిన ఖర్చు 40 శాతం పెరిగింది. యూజర్లు రెండో ఆలోచన లేకుండా వాలెట్లను తెగ వాడేశారు. గత వన్ డే ప్రపంచ కప్ ఫైనల్తో పోలిస్తే, T20 ప్రపంచ కప్ ఫైనల్లో క్విక్ కామర్స్లో కొనుగోళ్లు 40 శాతం పెరిగాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు, శనివారం రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య, క్విక్ కామర్స్ ద్వారా ప్రజలు విరామం లేకుండా ఆర్డర్లు పెట్టారు. ఆ 3 గంటల పాటు ఆర్డర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. శనివారం, Simpl రిపోర్టు ప్రకారం.. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 16,410 ఖర్చు చేశాడు. మరో వినియోగదారుడు ఏకంగా 59 ఆర్డర్లు చేశాడు. జెప్టో (Zepto), బ్లింకిట్ (Blinkit), స్విగ్గీ ఇన్స్టామార్ట్ (Swiggy Instamart), పోర్టర్ (Porter) సహా వివిధ ప్లాట్ఫామ్స్లో Simpl ద్వారా రూ. 100 లోపు విలువైన ఆర్డర్లు తెరిపిలేకుండా వస్తూనే ఉన్నాయి. గత ఏడాది నవంబర్లో జరిగిన ఫైనల్తో పోలిస్తే ఈసారి ఆర్డర్లు 35% పెరిగాయి.
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!