T20 World Cup 2024 Final : వామ్మో..మ్యాచ్ రోజు జనాలు తెగ తినేశారు..తాగేశారు..
- కిక్కిరిసిన రెస్టారెంట్లు.. బార్లు
- 40% నుంచి 50% వరకు పెరిగిన విక్రయాలు..ఆదాయాలు
- ఆహారం పానీయాల కోసం భారీగా ఆర్డర్లు
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించి విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయతీరాలకు చేర్చారు. తాజాగా మ్యాచ్ రోజు జరిగిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జనాలు ఫుల్ గా తినడం, తాగడం చేశారు. దీంతో ఒక్కసారిగా హోటళ్లు, బార్ల గిరాకీ పెరిగింది. ఇష్టమైన ఆహార పదార్థాలు తింటూ ఫైనల్ మ్యాచ్ను ఆస్వాదించారు. కప్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునేందుకు ప్రజలు ఆహారం & పానీయాల కోసం అమితంగా ఆర్డర్లు పెట్టారు. దీంతో రెస్టారెంట్లతో పాటు శీఘ్ర వాణిజ్య సంస్థల విక్రయాలు, ఆదాయాలు 40% నుంచి 50% వరకు పెరిగాయి. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలోని విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్ పూర్తిగా నిండిపోయింది. పూర్తి సామర్థ్యంతో అక్కడ బిజినెస్ జరిగింది. ది బీర్ కేఫ్ రెస్టారెంట్ ప్రారంభమై 12 సంవత్సరాలు గడిచాయి. గతంలో ఎన్నడూ లేనంత “సింగిల్ డే రెవెన్యూ”ను ఆ రెస్టారెంట్ చైన్ సాధించింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో బార్లు కేఫ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు నిండిపోయాయి. బిజినెస్ మహా జోరుగా సాగింది. కొందరు వ్యాపారులు చెప్పిన ప్రకారం… వాళ్ల వ్యాపార ప్రాంగణాల్లో అంత పెద్ద జన సమూహాన్ని చూడడం అదే తొలిసారి.
READ MORE: Sunaina : దుబాయ్ యూట్యూబర్ తో పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్.. బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..
Also Read
- Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
- Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
- Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
- Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
ఫిన్టెక్ స్టార్టప్ ‘సింపుల్’ (Simpl) రిపోర్ట్ ప్రకారం.. క్రికెట్ వరల్డ్ కప్ T20 ఫైనల్ మ్యాచ్ సమయంలో ఈ ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదార్లు చేసిన ఖర్చు 40 శాతం పెరిగింది. యూజర్లు రెండో ఆలోచన లేకుండా వాలెట్లను తెగ వాడేశారు. గత వన్ డే ప్రపంచ కప్ ఫైనల్తో పోలిస్తే, T20 ప్రపంచ కప్ ఫైనల్లో క్విక్ కామర్స్లో కొనుగోళ్లు 40 శాతం పెరిగాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు, శనివారం రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య, క్విక్ కామర్స్ ద్వారా ప్రజలు విరామం లేకుండా ఆర్డర్లు పెట్టారు. ఆ 3 గంటల పాటు ఆర్డర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. శనివారం, Simpl రిపోర్టు ప్రకారం.. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 16,410 ఖర్చు చేశాడు. మరో వినియోగదారుడు ఏకంగా 59 ఆర్డర్లు చేశాడు. జెప్టో (Zepto), బ్లింకిట్ (Blinkit), స్విగ్గీ ఇన్స్టామార్ట్ (Swiggy Instamart), పోర్టర్ (Porter) సహా వివిధ ప్లాట్ఫామ్స్లో Simpl ద్వారా రూ. 100 లోపు విలువైన ఆర్డర్లు తెరిపిలేకుండా వస్తూనే ఉన్నాయి. గత ఏడాది నవంబర్లో జరిగిన ఫైనల్తో పోలిస్తే ఈసారి ఆర్డర్లు 35% పెరిగాయి.
తాజావార్తలు
-
Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
-
US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!