T20 World Cup 2024 Final : వామ్మో..మ్యాచ్ రోజు జనాలు తెగ తినేశారు..తాగేశారు..
- కిక్కిరిసిన రెస్టారెంట్లు.. బార్లు
- 40% నుంచి 50% వరకు పెరిగిన విక్రయాలు..ఆదాయాలు
- ఆహారం పానీయాల కోసం భారీగా ఆర్డర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించి విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయతీరాలకు చేర్చారు. తాజాగా మ్యాచ్ రోజు జరిగిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జనాలు ఫుల్ గా తినడం, తాగడం చేశారు. దీంతో ఒక్కసారిగా హోటళ్లు, బార్ల గిరాకీ పెరిగింది. ఇష్టమైన ఆహార పదార్థాలు తింటూ ఫైనల్ మ్యాచ్ను ఆస్వాదించారు. కప్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునేందుకు ప్రజలు ఆహారం & పానీయాల కోసం అమితంగా ఆర్డర్లు పెట్టారు. దీంతో రెస్టారెంట్లతో పాటు శీఘ్ర వాణిజ్య సంస్థల విక్రయాలు, ఆదాయాలు 40% నుంచి 50% వరకు పెరిగాయి. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలోని విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్ పూర్తిగా నిండిపోయింది. పూర్తి సామర్థ్యంతో అక్కడ బిజినెస్ జరిగింది. ది బీర్ కేఫ్ రెస్టారెంట్ ప్రారంభమై 12 సంవత్సరాలు గడిచాయి. గతంలో ఎన్నడూ లేనంత “సింగిల్ డే రెవెన్యూ”ను ఆ రెస్టారెంట్ చైన్ సాధించింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో బార్లు కేఫ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు నిండిపోయాయి. బిజినెస్ మహా జోరుగా సాగింది. కొందరు వ్యాపారులు చెప్పిన ప్రకారం… వాళ్ల వ్యాపార ప్రాంగణాల్లో అంత పెద్ద జన సమూహాన్ని చూడడం అదే తొలిసారి.
READ MORE: Sunaina : దుబాయ్ యూట్యూబర్ తో పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్.. బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..
Also Read
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఫిన్టెక్ స్టార్టప్ ‘సింపుల్’ (Simpl) రిపోర్ట్ ప్రకారం.. క్రికెట్ వరల్డ్ కప్ T20 ఫైనల్ మ్యాచ్ సమయంలో ఈ ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదార్లు చేసిన ఖర్చు 40 శాతం పెరిగింది. యూజర్లు రెండో ఆలోచన లేకుండా వాలెట్లను తెగ వాడేశారు. గత వన్ డే ప్రపంచ కప్ ఫైనల్తో పోలిస్తే, T20 ప్రపంచ కప్ ఫైనల్లో క్విక్ కామర్స్లో కొనుగోళ్లు 40 శాతం పెరిగాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు, శనివారం రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య, క్విక్ కామర్స్ ద్వారా ప్రజలు విరామం లేకుండా ఆర్డర్లు పెట్టారు. ఆ 3 గంటల పాటు ఆర్డర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. శనివారం, Simpl రిపోర్టు ప్రకారం.. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 16,410 ఖర్చు చేశాడు. మరో వినియోగదారుడు ఏకంగా 59 ఆర్డర్లు చేశాడు. జెప్టో (Zepto), బ్లింకిట్ (Blinkit), స్విగ్గీ ఇన్స్టామార్ట్ (Swiggy Instamart), పోర్టర్ (Porter) సహా వివిధ ప్లాట్ఫామ్స్లో Simpl ద్వారా రూ. 100 లోపు విలువైన ఆర్డర్లు తెరిపిలేకుండా వస్తూనే ఉన్నాయి. గత ఏడాది నవంబర్లో జరిగిన ఫైనల్తో పోలిస్తే ఈసారి ఆర్డర్లు 35% పెరిగాయి.
తాజావార్తలు
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!