Dhanush: సరదాగా చేస్తే.. ఇన్నేళ్లుగా వెంటాడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: వరుస సినిమాల హిట్తో మంచి జోరు మీద ఉన్న హీరో ధనుష్. ఆయన భాషతో సంబంధం లేకుండా కోలీవుడ్, టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక వైపు హీరోగా చేస్తూనే డైరెక్టర్గా కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు ఈ స్టా్ర్ హీరో. ధనుష్ అంటే హీరో, డైరెక్టర్గా మాత్రమే కాకుండా ఒక మంచి సింగర్ కూడా వెంటనే గుర్తుకు వస్తారు. ఆయన పాడిన ‘వై దిస్ కొలవరి’ పాటకు జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఇప్పటికీ కూడా ఈ పాట సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంది. ఇటీవల ఈ స్టార్ హీరో ఈ పాట గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇంతకీ ధనుష్ ఈ పాట గురించి ఏమన్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: RGV-Rajamouli : ‘‘నాస్తికుడు వల్ల దేవుడి స్థాయి తగ్గదు” – జక్కన్న తరపున ఆర్జీవీ పంచ్ పోస్ట్ వైరల్
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ఈ పాట ధనుష్ – శ్రుతిహాసన్ నటించిన ‘3’ సినిమాలోనిది. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు. ఈ సినిమా 2012లో విడుదలైన సూపర్ హిట్గా నిలిచింది. సినిమాలో భాగంగా రిలీజ్ అయిన ‘వై దిస్ కొలవెరి’ పాట ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. వాస్తవానికి ఈ పాట కారణంగానే ఈ సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకూ యూట్యూబ్లో ఈ పాటకు ఏకంగా 560 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ఇటీవల దుబాయ్లో వాచ్ వీక్ కార్యక్రమంలో ఈ స్టార్ హీరో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఈ పాట గురించి మాట్లాడుతూ.. ‘సరదాగా ఒకరోజు చిన్న ట్యూన్ చేసి లిరిక్స్ పాడాం. తర్వాత దాని గురించి మర్చిపోయాం. కొన్ని నెలలకు ఆ పాటను వినాలనిపించింది. విన్న తర్వాత అది చాలా ఫన్నీగా ఉండడంతో దాన్ని సినిమాలో భాగం చేశాం. అయితే అది సూపర్ హిట్ అయింది. ఊహించని స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఆ పాటలో లిరిక్స్ తమిళ్, ఇంగ్లిష్ రెండు భాషలు కలిపి ఉంటాయి. అది వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. దశాబ్దం గడిచినా ఆ పాటను మాత్రం ఆడియన్స్ మర్చిపోవడం లేదు’’ అంటూ ధనుష్ సరదాగా చెప్పారు.
READ ALSO: Ravi Naidu Animini: ఇంటర్నేషనల్ స్టేడియంగా మారనున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం..!
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?