ICC T20 World Cup: బంగ్లాదేశ్కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్లు ఆడాలంటే భారత్కు రావాల్సిందే.. లేదంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వేదిక మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడాలంటే బంగ్లాదేశ్ జట్టు తప్పకుండా భారత్కు రావాల్సిందేనని స్పష్టం చేసింది. భారత్కు రాకపోతే పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తాజా సమాచారం ప్రకారం.. వర్చువల్ సమావేశంలో ఐసీసీ ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. భద్రతా కారణాల పేరుతో భారత్ కాకుండా శ్రీలంకాలో మ్యాచ్లు నిర్వహించాలన్న అభ్యర్థనను అంగీకరించబోమని ఐసీసీ తెల్చి చెప్పేసింది. టీ20 వరల్డ్ కప్ ఆడాలంటే భారత్కు రావడం తప్ప మరో మార్గం లేదని, లేకపోతే నష్టమేనని ఐసీసీ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఐసీసీ తమ అభ్యర్థనను తిరస్కరించిన విషయం తమకు అధికారికంగా తెలియలేదని బీసీబీ వర్గాలు అంటున్నాయి.
READ MORE: Haryana: మగ బిడ్డ కోసం ఆరాటం.. 10 మంది కుమార్తెల తర్వాత…!
Also Read
- Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
- Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
- Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్మనీ"పై టీఎంసీలో భయం..
ఈ వివాదానికి ఐపీఎల్లో జరిగిన ఒక సంఘటన సైతం కారణం. కోల్కతా నైట్రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ను బీసీసీఐ సూచనతో తొలగించింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో రెహ్మాన్పై వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లోనే బీసీసీఐ అతన్ని విడుదల చేసింది. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ను బహిష్కరిస్తామని హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ఐసీసీకి లేఖ రాసింది. భారత్లో తమ జట్టు మ్యాచ్లు ఆడదని, ఆ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది. తమ ఆటగాళ్ల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఐసీసీ తుది నిర్ణయం చెప్పేసింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడాలంటే బంగ్లాదేశ్ జట్టు భారత్కే రావాలని, వేదిక మార్పు ప్రశ్నే లేదని స్పష్టం చేసింది.
READ MORE: Amaravati: ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. 20,494 ఎకరాలు సమీకరణ
తాజావార్తలు
-
Electric Scooters: ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా.. వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? పూర్తి వివరాలు
-
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా… ఐయండిబిలో 9.1 రేటింగ్… తెలుగులోనూ చూడచ్చు
-
Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
-
Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
-
Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..