Dress Code: పూరీ జగన్నాథ ఆలయంలో డ్రెస్ కోడ్.. అలా వస్తే నో పర్మిషన్
పూరీ జగన్నాథ ఆలయంలో కొత్తగా డ్రెస్ కోడ్ అమలు చేస్తుంది. ఈ రూల్ నిన్నటి (సోమవారం) నుంచి అమలులోకి వచ్చింది. ఒడిశాలోని పూరీ నగరంలోని ప్రఖ్యాత జగన్నాథ టెంపుల్ లోకి హాఫ్ ప్యాంట్, షార్ట్, రిప్డ్ జీన్స్, స్కర్ట్స్, స్లీవ్లెస్ డ్రెస్లు ధరించిన వారికి ప్రవేశం లేదని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి సంప్రదాయబద్దమైన దుస్తులు ధరించాలని అధికారులు కోరారు. కొత్త డ్రెస్ కోడ్ నియమం అమల్లోకి వచ్చిన తర్వాత పురుషులు ధోతీలు ధరించి 12వ శతాబ్దపు మందిరంలోకి ప్రవేశిస్తున్నారు.
Read Also: Revanth Reddy: పాతబస్తీ మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో.. రూట్ మార్పుతో తగ్గనున్న వ్యయం
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ఇక, మహిళలు ఎక్కువగా చీరలు లేదా సల్వార్ కమీజ్లలో ఆలయానికి వస్తున్నారు. డ్రెస్ కోడ్పై భక్తులకు అవగాహన కల్పించాలని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా విభాగం హోటళ్ల యజమానులను తెలిపింది. పూరి ఆలయం లోపల గుట్కా, పాన్ నమలడంపై నిఘా విధించింది. అంతే కాకుండా ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని కూడా అధికారులు నిషేధించింది. నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీని ఎదుర్కొనేందుకు తెల్లవారు జామున 1.40 గంటలకే ఆలయ తలుపులు తెరిచారు.
Read Also: Liqour Sales New Record: న్యూ ఇయర్ జోష్.. ఏపీలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్
అయితే, సాయంత్రం 5 గంటల వరకు పూరీ జగన్నాథ ఆలయాన్ని 3.5 లక్షల మంది సందర్శించారని ఆలయ కమిటీ చెప్పింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల తోబుట్టువుల నిలయమైన ఉన్న ఈ ఆలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. నిర్మాణంలో తాగు నీరు, పబ్లిక్ టాయిలెట్లు లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయంలో సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
Read Also: New Year: ఒకే కొత్త సంవత్సరం.. అక్కడ మాత్రం 16 సార్లు వేడుకలు
గతేడాదితో పోల్చితే ఈసారి కొత్త సంవత్సరం రోజున ఆలయానికి భారీగా భక్తులు వచ్చారు. దీంతో పూరి పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బడాదండలోని మార్కెట్ చక్కా నుంచి సింగద్వార మధ్య ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా తెలిపింది. దిగబరేణి నుంచి లైట్ హౌస్ వరకు బీచ్ సైడ్ రోడ్డులో వెహికిల్స్ రాకపోకలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. భువనేశ్వర్లోని లింగరాజ్ ఆలయం లోపల పాన్, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని కూడా అధికారులు నిషేధించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!