Pawan Kalyan: శ్రీవారి లడ్డూ వివాదంపై పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్..
- తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్
- ప్రజల మనోభావాలు గౌరవించకుండా ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు. శ్రీవారి లడ్డూ కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన అన్నారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న పవన్ కల్యాణ్.. తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ను ఏర్పాటు చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం కోరారు. తిరుమలలో కొనసాగుతున్న లడ్డూ వివాదంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయం దేవాలయాల అపవిత్రత, దాని భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతుల చుట్టూ ఉన్న అనేక సమస్యలను సూచిస్తుందన్నారు.
Read Also: CM Chandrababu: దీపావళికి ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్.. అన్నీ హామీలను నెరవేరుస్తాం..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
చాలా ప్రశ్నలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలన్నారు. మొత్తం భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ విషయంపై జాతీయ స్థాయిలో చర్చకు పిలుపునిచ్చారు. సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని కోరారు. లడ్డూ ప్రసాదంపై ప్రజల నుంచి ఫిర్యాదు అందాయని.. ల్యాబ్ పరీక్షలు చేయించాలని చాలా మంది ఫిర్యాదు చేశారన్నారు. ప్రజల మనోభావాలు గౌరవించకుండా ఆలయ పవిత్రతను దెబ్బతీశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రజల మనోభావాలతో ఎవరూ చెలగాటమాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!