K.Keshava Rao : డీలిమిటేషన్ అంశంపై కేకే కీలక వ్యాఖ్యలు
- డీలిమిటేషన్ – రాజకీయ ఏకీకరణపై కొనసాగుతున్న వివాదం
- దక్షిణాది రాష్ట్రాల హక్కులు – బీజేపీ మౌనం ఎందుకు?
- హైదరాబాద్లో బహిరంగ సభ – రాబోయే రాజకీయ మార్పులకు శ్రీకారం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K.Keshava Rao : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు డీలిమిటేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పొలిటికల్ యూనిటీ (రాజకీయ ఏకీకరణ) గురించి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశం గురించి మాట్లాడుతూ, ఈ మీటింగ్కు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు.
కే. కేశవరావు మాట్లాడుతూ, డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్లో సీట్ల పెంపు గురించి కాదని, ప్రతి రాష్ట్రానికి బలమైన ప్రతినిధిత్వం ఉండాలని కోరే ప్రక్రియ అని వివరించారు. ప్రతి జనాభా గణన తర్వాత ఇదే వివాదం మళ్లీ మళ్లీ తెరపైకి వస్తుందని గుర్తు చేశారు. ప్రధానంగా ఫెడరలిజం నశిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “మోడీ – అమిత్ షా ఫెడరలిజాన్ని పూర్తిగా మర్చిపోయారు. సెంట్రల్ లిస్ట్ను పెద్దది చేశారు, స్టేట్ లిస్ట్ను తగ్గించారు. ఫలితంగా, రాష్ట్రాల హక్కులు పోతున్నాయి” అని కేశవరావు వ్యాఖ్యానించారు.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
డీలిమిటేషన్ అంశంపై బీజేపీ మౌనంగా ఉంటోందని, ఉత్తరాది రాష్ట్రాల్లో అస్సాం, జమ్ముకాశ్మీర్ వంటి ప్రాంతాల్లో సీట్ల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తూనే, దక్షిణాదిలో మాత్రం విస్మరించడం దారుణమని అన్నారు. తెలంగాణకు సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. “సీట్లు పెంచండి అని అడగడం వల్ల రాష్ట్రాల హక్కులు దక్కుతాయి. కానీ అమిత్ షా తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం లేదు. అలాంటి మైండ్సెట్తో సమస్యల పరిష్కారం కాదు” అని కేశవరావు విమర్శించారు.
కేశవరావు ఇందిరా గాంధీ హయాంలో కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయని గుర్తు చేశారు. అయితే, డీలిమిటేషన్ వ్యవహారంలో ప్రస్తుతం కథానాయకుడు స్టాలిన్ అయినా, హీరో మాత్రం రేవంత్ రెడ్డేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “హైదరాబాద్లో బహిరంగ సభ పెడతామని ప్రకటించడం దక్షిణాది రాష్ట్రాల కోసం కీలక పరిణామం. ఇది రాబోయే రాజకీయ అజెండాను మలుపుతిప్పే అవకాశం ఉంది” అని కేశవరావు అభిప్రాయపడ్డారు.
Vivo Y19e:5500mAh బ్యాటరీ.. ప్రీమియం లుక్ తో వివో నుంచి చౌకైన ఫోన్..
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?