K.Keshava Rao : డీలిమిటేషన్ అంశంపై కేకే కీలక వ్యాఖ్యలు
- డీలిమిటేషన్ – రాజకీయ ఏకీకరణపై కొనసాగుతున్న వివాదం
- దక్షిణాది రాష్ట్రాల హక్కులు – బీజేపీ మౌనం ఎందుకు?
- హైదరాబాద్లో బహిరంగ సభ – రాబోయే రాజకీయ మార్పులకు శ్రీకారం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K.Keshava Rao : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు డీలిమిటేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పొలిటికల్ యూనిటీ (రాజకీయ ఏకీకరణ) గురించి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశం గురించి మాట్లాడుతూ, ఈ మీటింగ్కు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు.
కే. కేశవరావు మాట్లాడుతూ, డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్లో సీట్ల పెంపు గురించి కాదని, ప్రతి రాష్ట్రానికి బలమైన ప్రతినిధిత్వం ఉండాలని కోరే ప్రక్రియ అని వివరించారు. ప్రతి జనాభా గణన తర్వాత ఇదే వివాదం మళ్లీ మళ్లీ తెరపైకి వస్తుందని గుర్తు చేశారు. ప్రధానంగా ఫెడరలిజం నశిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “మోడీ – అమిత్ షా ఫెడరలిజాన్ని పూర్తిగా మర్చిపోయారు. సెంట్రల్ లిస్ట్ను పెద్దది చేశారు, స్టేట్ లిస్ట్ను తగ్గించారు. ఫలితంగా, రాష్ట్రాల హక్కులు పోతున్నాయి” అని కేశవరావు వ్యాఖ్యానించారు.
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
డీలిమిటేషన్ అంశంపై బీజేపీ మౌనంగా ఉంటోందని, ఉత్తరాది రాష్ట్రాల్లో అస్సాం, జమ్ముకాశ్మీర్ వంటి ప్రాంతాల్లో సీట్ల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తూనే, దక్షిణాదిలో మాత్రం విస్మరించడం దారుణమని అన్నారు. తెలంగాణకు సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. “సీట్లు పెంచండి అని అడగడం వల్ల రాష్ట్రాల హక్కులు దక్కుతాయి. కానీ అమిత్ షా తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం లేదు. అలాంటి మైండ్సెట్తో సమస్యల పరిష్కారం కాదు” అని కేశవరావు విమర్శించారు.
కేశవరావు ఇందిరా గాంధీ హయాంలో కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయని గుర్తు చేశారు. అయితే, డీలిమిటేషన్ వ్యవహారంలో ప్రస్తుతం కథానాయకుడు స్టాలిన్ అయినా, హీరో మాత్రం రేవంత్ రెడ్డేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “హైదరాబాద్లో బహిరంగ సభ పెడతామని ప్రకటించడం దక్షిణాది రాష్ట్రాల కోసం కీలక పరిణామం. ఇది రాబోయే రాజకీయ అజెండాను మలుపుతిప్పే అవకాశం ఉంది” అని కేశవరావు అభిప్రాయపడ్డారు.
Vivo Y19e:5500mAh బ్యాటరీ.. ప్రీమియం లుక్ తో వివో నుంచి చౌకైన ఫోన్..
తాజావార్తలు
-
Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?