Gunfire Due To Pizza: పిజ్జా కోసం తుపాకీతో కాల్పులు.. మహిళా పరిస్థితి విషమం
- దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన.
- పిజ్జా కోసం తూపికితో కాల్పులు..
- మహిళా పరిస్థితి విషమం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunfire Due To Pizza: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పిజ్జా తినడంపై కుటుంబంలో తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారం సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య పిజ్జా పంపిణీపై వాగ్వాదం తర్వాత, ఒక మహిళను ఆమె తోడికోడలు సోదరుడు కాల్చాడు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Read Also: Manipur BJP MLAs: సీఎంగా బీరెన్ సింగ్ను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్.. ప్రధానికి లేఖ
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ఈ మొత్తం వ్యవహారం బుధవారం రాత్రి జరగగా.. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సద్మా అనే మహిళ బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేరినట్లు జీటీబీ ఆస్పత్రి నుంచి సీలంపూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాధితురాలి భర్త సోదరుడు జీషాన్ బుధవారం కుటుంబ సభ్యులందరికీ పిజ్జా తెచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, జీషాన్ తన తమ్ముడు జావేద్ భార్య సద్మాతో సహా కుటుంబ సభ్యులందరికీ పిజ్జా ఇచ్చాడని అధికారి తెలిపారు. దీంతో జీషాన్ భార్యకు కోపం రావడంతో అక్కడ కాస్త గొడవ మొదలైంది.
Viral Video: దేవుడా.. ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు
జీషాన్ భార్య సాదియాకు సద్మాతో వివాదం ఇదివరకే ఉందని, ఈ విషయంపై వారి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. దాంతో రాత్రి సాదియా తన నలుగురు సోదరులు తఫ్సీర్ , ముంతహీర్, షాజాద్, గుల్రేజ్ సోదరులను ఇంటికి పిలవడంతో.. వారు వచ్చిన తర్వాత గొడవలు మరింత పెరిగాయి. ఈ సమయంలో ముంతహిర్ ఒక బుల్లెట్ కాల్చాడు. అది సద్మాను తాకింది. ఘటనలో సద్మా కడుపులో బులెట్ దిగడంతో ఆమెను జీటీబీ ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నట్లు జూచి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలం నుంచి ముంతహీర్, తఫ్సీర్, షాజాద్, గుల్రేజ్ లను అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!