Kejriwal: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల.. ఆప్ శ్రేణులు ఘన స్వాగతం
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు బెయిల్ ఇచ్చింది. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బెయిల్ ఇచ్చినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే పార్టీ శ్రేణులనుద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడతారని మంత్రి అతిషి తెలిపారు. జైలు నుంచి బయటకు రాగానే కేజ్రీవాల్కు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, కుమర్తె, ఆప్ మంత్రులు, నాయకులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Refund Amount: భారతీయ రైల్వే గుడ్ న్యూస్.. ఇక 6 గంటల్లోనే రీఫండ్..
Also Read
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ఇదిలా ఉంటే కేవలం లోక్సభ ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇచ్చినట్లు న్యాయస్థానం తెలిపింది. బెయిల్ సమయంలో సీఎం కార్యాలయం లేదా సచివాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని సూచించింది.
ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆరు విడతలో పోలింగ్ జరగనుంది. అనగా మే 25న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు. ముఖ్యమంత్రి మనవి అంగీకరించి.. ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. జైలు నుంచి రాగానే కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేయొచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Chhattisgarh: బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కేజ్రీవాల్ను రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. దాదాపు 50 రోజుల తర్వాత ఆయనకు విముక్తి లభించింది.
ఇది కూడా చదవండి: Night Shifts: కేవలం 3 నైట్ షిఫ్టులు చాలు షుగర్, ఊబకాయం రావడానికి.. అధ్యయనంలో వెల్లడి..
#WATCH | Delhi CM Arvind Kejriwal addresses party workers after being released from Tihar jail.
CM Kejriwal says, "Tomorrow at 11 am we will go to the Hanuman Temple at Connaught Place and at 1 pm, we will address a press conference at the party office."
The Supreme Court… pic.twitter.com/76ij5KZ4iw
— ANI (@ANI) May 10, 2024
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!