Air India Flight: ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్ ఆలస్యం.. చెన్నైలో చిక్కుకున్న 150 మంది ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Flight: ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానం సోమవారం ఆలస్యం కావడంతో చెన్నై విమానాశ్రయంలో సుమారు 150 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ విమానం సోమవారం ఉదయం 10.05 గంటలకు చెన్నై నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే, ప్రయాణికులు విమానాశ్రయంలోని బోర్డింగ్ గేట్ వద్ద వేచి ఉన్నారు. విమానం ఎందుకు ఆలస్యమైందనే విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానయాన సంస్థ తమకు ప్రత్యామ్నాయ విమానాలను అందించలేదని కూడా వారు చెప్పారు.
Also Read
- Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
- Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
ఇలాంటి మరో సంఘటనలో, లండన్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలోని ప్రయాణీకులు ఆదివారం జైపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం జైపూర్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. సుమారు రెండు గంటల తర్వాత, లండన్ నుంచి వచ్చే విమానం ఢిల్లీకి తన ప్రయాణాన్ని పునఃప్రారంభించేందుకు అనుమతి పొందినప్పుడు, విమాన విధి సమయ పరిమితులను పేర్కొంటూ పైలట్ విమానాన్ని నడపడానికి నిరాకరించాడు. ఎయిర్ ఇండియా తన ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఓ ప్రకటనను ఎయిరిండియా విడుదల చేసింది.
Also Read: Amit shah And Modi: మణిపూర్లో పరిస్థితిని ప్రధానికి వివరించిన అమిత్ షా
ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. లండన్ నుంచి బయల్దేరిన ఎయిరిండియా ఏఐ-112 విమానం షెడ్యూల్ ప్రకారం ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే, ఢిల్లీ ఎయిర్పోర్టు వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో 10 నిమిషాల పాటు అక్కడే గాల్లో చక్కర్లు కొట్టిన విమానాన్ని ఆ తర్వాత రాజస్థాన్లోని జైపూర్కు దారిమళ్లించారు. దీంతో విమానం జైపుర్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది.
అయితే, దాదాపు రెండు గంటల తర్వాత విమానం తిరిగి దిల్లీ వెళ్లేందుకు దిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, పైలట్ మాత్రం విమానాన్ని టేకాఫ్ చేసేందుకు నిరాకరించాడు. డ్యూటీ సమయం పరిమితులు, పనిగంటలను కారణంగా చూపి తాను విమానాన్ని నడపబోనని పట్టుబట్టాడు. దీంతో దాదాపు 350 మంది ప్రయాణికులు జైపుర్ ఎయిర్పోర్టులో చిక్కుకుపోయారు. వీరిని గమ్యస్థానానికి చేర్చేందుకు ఎయిరిండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మూడు గంటల పాటు ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో కొందరు రోడ్డు మార్గంలో ఢిల్లీ వెళ్లిపోయారు. ఆ అవకాశం లేనివారు ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
-
Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!