Air India Flight: ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్ ఆలస్యం.. చెన్నైలో చిక్కుకున్న 150 మంది ప్రయాణికులు
Air India Flight: ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానం సోమవారం ఆలస్యం కావడంతో చెన్నై విమానాశ్రయంలో సుమారు 150 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ విమానం సోమవారం ఉదయం 10.05 గంటలకు చెన్నై నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే, ప్రయాణికులు విమానాశ్రయంలోని బోర్డింగ్ గేట్ వద్ద వేచి ఉన్నారు. విమానం ఎందుకు ఆలస్యమైందనే విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానయాన సంస్థ తమకు ప్రత్యామ్నాయ విమానాలను అందించలేదని కూడా వారు చెప్పారు.
Also Read
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
- RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
ఇలాంటి మరో సంఘటనలో, లండన్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలోని ప్రయాణీకులు ఆదివారం జైపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం జైపూర్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. సుమారు రెండు గంటల తర్వాత, లండన్ నుంచి వచ్చే విమానం ఢిల్లీకి తన ప్రయాణాన్ని పునఃప్రారంభించేందుకు అనుమతి పొందినప్పుడు, విమాన విధి సమయ పరిమితులను పేర్కొంటూ పైలట్ విమానాన్ని నడపడానికి నిరాకరించాడు. ఎయిర్ ఇండియా తన ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఓ ప్రకటనను ఎయిరిండియా విడుదల చేసింది.
Also Read: Amit shah And Modi: మణిపూర్లో పరిస్థితిని ప్రధానికి వివరించిన అమిత్ షా
ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. లండన్ నుంచి బయల్దేరిన ఎయిరిండియా ఏఐ-112 విమానం షెడ్యూల్ ప్రకారం ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే, ఢిల్లీ ఎయిర్పోర్టు వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో 10 నిమిషాల పాటు అక్కడే గాల్లో చక్కర్లు కొట్టిన విమానాన్ని ఆ తర్వాత రాజస్థాన్లోని జైపూర్కు దారిమళ్లించారు. దీంతో విమానం జైపుర్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది.
అయితే, దాదాపు రెండు గంటల తర్వాత విమానం తిరిగి దిల్లీ వెళ్లేందుకు దిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, పైలట్ మాత్రం విమానాన్ని టేకాఫ్ చేసేందుకు నిరాకరించాడు. డ్యూటీ సమయం పరిమితులు, పనిగంటలను కారణంగా చూపి తాను విమానాన్ని నడపబోనని పట్టుబట్టాడు. దీంతో దాదాపు 350 మంది ప్రయాణికులు జైపుర్ ఎయిర్పోర్టులో చిక్కుకుపోయారు. వీరిని గమ్యస్థానానికి చేర్చేందుకు ఎయిరిండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మూడు గంటల పాటు ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో కొందరు రోడ్డు మార్గంలో ఢిల్లీ వెళ్లిపోయారు. ఆ అవకాశం లేనివారు ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
PEDDI Press Meet : ‘పెద్ది’ షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
-
Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
-
Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!