Amit shah And Modi: మణిపూర్లో పరిస్థితిని ప్రధానికి వివరించిన అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit shah And Modi: విదేశీ పర్యటన ముగించుకొని దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి మణిపూర్లోని తాజా పరిస్థితుల గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వివరించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగడం లేదని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్కు హామీ ఇచ్చినట్టు తెలిపారు.
Read also: Malla Reddy: ఖబడ్దార్.. కేసీఆర్ ను ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు
Also Read
- BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్లో పేరు మాయం!
- Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
సంక్షోభంలో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరించడానికి మణిపూర్ ప్రభుత్వం మరియు కేంద్రం తీసుకున్న చర్యలను హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. ఐదు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ ఈరోజు తెల్లవారుజామున భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ అమిత్ షాను ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లి మణిపూర్లోని ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు హింసను నియంత్రించగలిగాయని రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అమితఖ షాతో అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడటానికి అన్ని విధాలా సాయం చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.
Read also: Kerala Story: కేరళ స్టోరీ టీమ్ అనౌన్స్ చేసిన కొత్త సినిమా ‘బస్తర్’
సమస్యను అనుభవిస్తున్న ప్రజలు, సివిల్ బాడీలు, ఎమ్మెల్యేలు మరియు రాజకీయ నాయకులు అందరూ కలిసి కూర్చుని, కలసి పని చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం సింగ్ సమావేశం అనంతరం విలేకరులతో అన్నారు. శనివారం 18 రాజకీయ పార్టీలతో జరిగిన అఖిలపక్ష సమావేశానికి షా అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం నిర్ణీత కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీ ప్రతినిధులు పట్టుబట్టారు. హింసాకాండకు గురైన రాష్ట్రంలో మొదటి రోజు నుండి పరిస్థితిని ప్రధాని పర్యవేక్షిస్తున్నారని మరియు సూక్ష్మంగా తమకు మార్గనిర్దేశం చేస్తున్నారని హోం మంత్రి తెలిపారు. మే 3న రాష్ట్రంలో మొదటి హింసాత్మక సంఘటన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 36,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించడం ద్వారా పరిస్థితులను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు. మణిపూర్లో పరిస్థితి నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది.
తాజావార్తలు
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
-
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
-
Yasha Nagula : యూట్యూబ్ను షేక్ చేసిన ‘యేషనాగుల’.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
-
Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
-
Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!