Brij Bhushan: బ్రిజ్ భూషణ్ కుమారుడికి బీజేపీ ఎంపీ టికెట్.. దేశ కూతుళ్లను ఓడించారు: రెజ్లర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brij Bhushan: భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కుమారుడికి భారతీయ జనతా పార్టీ ఎంపీ టికెట్ కేటాయించింది. దీనిపై రెజ్లర్లు మండిపడుతున్నారు. ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ విన్నర్ సాక్షి మాలిక్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా.. ఒక వ్యక్తి ముందు ఈ ప్రభుత్వం లొంగిపోయిందా అని క్వశ్చన్ చేసింది. ఇక, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను బ్రిజ్ భూషన్ ఎదుర్కొంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్ గంజ్ నుంచే కరణ్ భూషణ్ సింగ్ బరిలోకి దిగుతున్నారు.
Read Also: Mudragada vs Daughter: తన కూతురి వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ.. షాకింగ్ కామెంట్స్..!
Also Read
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
కాగా, ఈ దేశ కూతుళ్లు ఓడిపోయారని.. బ్రిజ్ భూషణ్ గెలిచాడని సాక్షి మాలిక్ మండిపడింది. బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా తామంతా భవిష్యత్ ను లెక్కచేయకుండా పోరాటం చేశామన్నారు. ఎన్నో రోజులు రోడ్లపైనే నిద్రించి ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్ ను ఈ ప్రభుత్వం ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. న్యాయం తప్ప, ఇంకేం డిమాండ్ చేయట్లేదన్నారు. అరెస్టు చేయకపోగా.. ఆయన కొడుకుకి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని విమర్శలు గుప్పించారు. కోట్లాది మంది అమ్మాయిల మనోధైర్యాన్ని బీజేపీ పార్టీ దెబ్బ తీసిందన్నారు. కేవలం ఒక కుటుంబానికే టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటే.. అతడి ముందు ఈ దేశ ప్రభుత్వం బలహీనపడిందా? అనే అనుమానం కలుగుతుందన్నారు. ఇక, శ్రీరాముడి పేరుతో ఓట్లు మాత్రమే కావాలా? ఆయన చూపిన మార్గంలో నడవరా? అంటూ సాక్షి మాలిక్ ప్రశ్నలు కురిపంచారు.
Read Also: Maharashtra: మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. క్షేమంగా బయటపడ్డ పైలెట్
ఇక, కైసర్గంజ్ పార్లమెంట్ స్థానానికి బ్రిజ్ భూషణ్ ఎంపీగా వరుసగా మూడుసార్లు గెలిచారు. ఆయనపై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. గతేడాది జనవరిలో సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ సహా రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. బీజేపీలో బ్రిజ్ భూషణ్ పై వ్యతిరేకత రావడంతో పాటు ఆయనకు ఈసారి టికెట్ కేటాయించలేదు. ఇక, ఆయన చిన్న కుమారుడు, బీజేపీ ఎంపీ అభ్యర్థి కరణ్ కుమార్.. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక, మరో కుమారుడు ప్రతీక్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!