Daggubati Purandeswari: కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం సాధ్యమైంది!
- బీజేపీలో చేరిన సౌత్ కాంగ్రెస్ ఇంచార్జ్ వాసుపల్లి సంతోష్
- ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడుతోంది
- కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా కమల వికాసం కనిపిస్తోందని, 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అద్భుతమైన సంపూర్ణ విజయం లభించిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం సాధ్యమైందని, ఈ గెలుపు వారికే అంకితం అని పేర్కొన్నారు. ఢిల్లీలో 10 ఏళ్లు మభ్యపెట్టి వంచించిన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి.. ప్రజలు సుపరిపాలనకు అవకాశం కల్పించారన్నారు. డబులు ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని ఢిల్లీ ప్రజలు నమ్మారన్నారు. ఢిల్లీ, ఏపీ ఎన్నికల ఫలితాలకు సారూప్యత ఉందని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి సౌత్ కాంగ్రెస్ ఇంచార్జ్ వాసుపల్లి సంతోష్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై స్పందించారు. ‘బీజేపీలో చేరేందుకు అన్ని జిల్లాల నుంచి నాయకత్వం రెడీగా ఉంది. దేశ వ్యాప్తంగా కమల వికాసం కనిపిస్తోంది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అద్భుతమైన సంపూర్ణ విజయం లభించింది. ఢిల్లీలో బీజేపీ గెలుపు కార్యకర్తల విజయం. ఈ విజయం వాళ్లకు అంకితం. ఢిల్లీలో 10 ఏళ్లు మభ్య పెట్టి వంచించిన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి సుపరిపాలనకు అవకాశం కల్పించారు. డబులు ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని ఢిల్లీ ప్రజలు నమ్మారు’ అని అన్నారు.
Also Read
- Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
‘ఢిల్లీ, ఏపీ ఎన్నికల ఫలితాలకు సారూప్యత ఉంది. ఐదేళ్లు విధ్వంసం ద్వారా జేబులు నింపుకున్నారు తప్ప నిజమైన లబ్ధిదారులకు చేరలేదు. అభివృద్ధి కూటమి ద్వారానే సాధ్యం అని నమ్మారు కనుక అనూహ్యమైన ఫలితం సాధ్యం అయ్యింది. పదేళ్లు అధికారంలో వున్న అప్ ను ఢిల్లీ ప్రజలు మోస్తే.. కేజ్రీవాల్ కూడా అవినీతికి అతీతుడు కాదని తేలిపోయింది. అభివృద్ధిని పట్టించుకోనీ అప్ కు గుణ పాఠం చెప్పారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడుతోంది’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!