Cyclone Montha: కాకినాడలో మొదలైన మొంథా తుపాన్ ప్రభావం.. ఒక్కసారిగా మారిన వాతావరణం!
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
- కాకినాడలో మొదలైన మొంథా తుపాన్ ప్రభావం
- కాకినాడలో ఒక్కసారిగా మారిన వాతావరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోస్తా జిల్లాల వైపు ‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని ఐఎండీ ఓ ప్రకటలో తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి.. రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం 12 గంటల పాటు తీవ్ర తుపాను తీవ్రత కొనసాగి.. ఆపై తుపానుగా బలహీనపడొచ్చని చెప్పింది. తుపాను ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
మొంథా తుపాన్ ప్రభావం కాకినాడలో మొదలైంది. సముద్రం దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. ఇపుడు భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. దాంతో తీర ప్రాంత మండలాల్లో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తాళ్లదేవు, ఉప్పాడ కొత్తపల్లి, తుని, తొండంగి మండలాలపై తుఫాన్ ప్రభావం భారీగా ఉండనుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాకినాడ చేరుకున్నాయి. రేపు సాయంత్రానికి కాకినాడ తుని మధ్య తుపాన్ తీరం దాటనుంది. ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- AI Robot: మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ రోబోట్ ప్రయోగం విజయవంతం
తుపాన్ ప్రభావంతో కాకినాడ యాంకరేజ్ పోర్ట్, డీప్ సీ పోర్ట్ ఖాళీ అయ్యాయి. కార్గో ఉన్న 15 షిప్లను సముద్రంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీచ్, పర్యాటక ప్రాంతాలు ఇప్పటికే మూసివేశారు. ఐదు రోజుల పాటు జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. సహాయక చర్యల కోసం వంద మంది గజ ఈత గాళ్ళు, 70 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్డీ బృందాలు ఉన్నాయి. సముద్రానికి మధ్యలో హాప్ ఐలాండ్ దీవిలో ఉన్న 110 మందిని అధికారులు తీరానికి చేర్చారు.
తాజావార్తలు
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
-
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!