BV Raghavulu: తెలంగాణలో సీపీఐ, సీపీఎం విడిపోలేదు.. బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu: మోదీకి, అమిత్ షా కి తెలీకుండా చంద్రబాబును బొక్కలో వేయలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జనసేన నాయకుడు మోడీని పొగడటమే సరిపోయింది బీసీ సభలో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మరల మూడోసారి మోడీ రావాలని పవన్ కళ్యాణ్ కోరారని.. మోడీ రాజకీయాలు నచ్చాయట పవన్ కళ్యాణ్కు అంటూ బీవీ రాఘవులు పేర్కొన్నారు. పవన్తో కామన్ మేనిఫెస్టో తెస్తున్న టీడీపీ కూడా బీజేపీ చెంతకే చేరుతుందన్నారు. మోడీ కాదా అమరావతి రాకుండా చేస్తోందని ఆయన ప్రశ్నించారు. మోడీ రాజకీయాలు ఏపీకి నష్టం చేస్తాయన్నారు. రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న మోడీ కాళ్ళు మొక్కే వాడు అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభిస్తాడా అంటూ ఆయన మండిపడ్డారు.
Also Read: Tummala Nageswara Rao : నాకు పదవులు అవసరం లేదు.. జిల్లా అభివృద్ధి కోసమే బరిలో ఉన్నా
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
సామాజిక సాధికారత యాత్రలు కావు.. సామాజిక సంహార యాత్రలు అవి అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజానికి కావాల్సిన అంశాలు తీసేస్తే మాట్లాడని వాళ్ళు సామాజిక సాధికారత యాత్రలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నలు గుప్పించారు. అమెరికాకి వెళ్ళే వారికి ఇంగ్లీషు చదువులు కావాలి… మాకు అక్కర్లా అంటూ బీవీ రాఘవులు అన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచీ తీసుకున్న అప్పుతో ఇంగ్లీషు చదువులు పెట్టాడు.. ఆ 2వేల కోట్లు మెక్కడానికే అంటూ ఆయన ఆరోపించారు. ఎన్డీఏ చేసిన ద్రోహంతో 20 ఏళ్ళు వెనక్కి పోయామన్నారు. ఏపీలో బీజేపీ ఉనికి లేదని.. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కాళ్ళకు మొక్కుతోందన్నారు. ఇక్కడ ఎలా మాట్లాడుకున్నా.. టీడీపీ, వైసీపీ కలిసి బీజేపీకి పార్లమెంటులో మద్దతిస్తాయని ఆయన అన్నారు.
తెలంగాణలో సీపీఐ, సీపీఎం విడిపోలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. తెలంగాణలో సీపీఐ పోటీ చేసే ఒక స్ధానంలో మద్దతిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. సీపీఐ, కాంగ్రెస్ ఒడంబడికతో మేం తెలంగాణలో అంగీకరించలేదన్నారు. సీపీఐకి టీడీపీ మీద ఆశ ఉందన్నారు. కాంగ్రెస్ ఏపీలో పెద్ద శక్తి ఏమీ కాదని.. రఘువీరా, రామకృష్ణ వేదికలకు పెద్ద విలువ ఏం లేదన్నారు. మోడీకి వ్యతిరేకంగా నిలబడే శక్తులు ఏపీలో కనబడటం లేదన్నారు. టిడిపి, వైసీపీ ఎన్డీయే కూటమిలో చేరాలని చూస్తున్నాయన్నారు. రాజకీయ ప్రత్యామ్నాయంగా ఉండేలా మూడు పార్టీలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామని బీవీ రాఘవులు వెల్లడించారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గం తెలుపుతూ సీపీఎం సభలు జరిగాయన్నారు. టిడిపి, వైసీపీ పాలనల్లో ఏపీ వెనకబడిపోయిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?