BV Raghavulu: తెలంగాణలో సీపీఐ, సీపీఎం విడిపోలేదు.. బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu: మోదీకి, అమిత్ షా కి తెలీకుండా చంద్రబాబును బొక్కలో వేయలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జనసేన నాయకుడు మోడీని పొగడటమే సరిపోయింది బీసీ సభలో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మరల మూడోసారి మోడీ రావాలని పవన్ కళ్యాణ్ కోరారని.. మోడీ రాజకీయాలు నచ్చాయట పవన్ కళ్యాణ్కు అంటూ బీవీ రాఘవులు పేర్కొన్నారు. పవన్తో కామన్ మేనిఫెస్టో తెస్తున్న టీడీపీ కూడా బీజేపీ చెంతకే చేరుతుందన్నారు. మోడీ కాదా అమరావతి రాకుండా చేస్తోందని ఆయన ప్రశ్నించారు. మోడీ రాజకీయాలు ఏపీకి నష్టం చేస్తాయన్నారు. రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న మోడీ కాళ్ళు మొక్కే వాడు అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభిస్తాడా అంటూ ఆయన మండిపడ్డారు.
Also Read: Tummala Nageswara Rao : నాకు పదవులు అవసరం లేదు.. జిల్లా అభివృద్ధి కోసమే బరిలో ఉన్నా
Also Read
సామాజిక సాధికారత యాత్రలు కావు.. సామాజిక సంహార యాత్రలు అవి అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజానికి కావాల్సిన అంశాలు తీసేస్తే మాట్లాడని వాళ్ళు సామాజిక సాధికారత యాత్రలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నలు గుప్పించారు. అమెరికాకి వెళ్ళే వారికి ఇంగ్లీషు చదువులు కావాలి… మాకు అక్కర్లా అంటూ బీవీ రాఘవులు అన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచీ తీసుకున్న అప్పుతో ఇంగ్లీషు చదువులు పెట్టాడు.. ఆ 2వేల కోట్లు మెక్కడానికే అంటూ ఆయన ఆరోపించారు. ఎన్డీఏ చేసిన ద్రోహంతో 20 ఏళ్ళు వెనక్కి పోయామన్నారు. ఏపీలో బీజేపీ ఉనికి లేదని.. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కాళ్ళకు మొక్కుతోందన్నారు. ఇక్కడ ఎలా మాట్లాడుకున్నా.. టీడీపీ, వైసీపీ కలిసి బీజేపీకి పార్లమెంటులో మద్దతిస్తాయని ఆయన అన్నారు.
తెలంగాణలో సీపీఐ, సీపీఎం విడిపోలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. తెలంగాణలో సీపీఐ పోటీ చేసే ఒక స్ధానంలో మద్దతిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. సీపీఐ, కాంగ్రెస్ ఒడంబడికతో మేం తెలంగాణలో అంగీకరించలేదన్నారు. సీపీఐకి టీడీపీ మీద ఆశ ఉందన్నారు. కాంగ్రెస్ ఏపీలో పెద్ద శక్తి ఏమీ కాదని.. రఘువీరా, రామకృష్ణ వేదికలకు పెద్ద విలువ ఏం లేదన్నారు. మోడీకి వ్యతిరేకంగా నిలబడే శక్తులు ఏపీలో కనబడటం లేదన్నారు. టిడిపి, వైసీపీ ఎన్డీయే కూటమిలో చేరాలని చూస్తున్నాయన్నారు. రాజకీయ ప్రత్యామ్నాయంగా ఉండేలా మూడు పార్టీలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామని బీవీ రాఘవులు వెల్లడించారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గం తెలుపుతూ సీపీఎం సభలు జరిగాయన్నారు. టిడిపి, వైసీపీ పాలనల్లో ఏపీ వెనకబడిపోయిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..