V Srinivasa Rao: అన్నయ్య కాంగ్రెస్కు అమ్మేస్తే.. పవన్ కల్యాణ్ ఆర్ఎస్ఎస్కు అమ్ముతావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Srinivasa Rao: అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్కు అమ్మేస్తే.. పవన్ కల్యాణ్.. జనసేన పార్టీని ఆర్ఎస్ఎస్కు అమ్ముతావా? అంటూ ప్రశ్నించారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకొని తిరుపతికి వస్తున్నారు.. తిరుమల సాక్షిగా ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇదే సమయంలో.. పవన్ కల్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటున్నారు.. అంటే బుల్డోజర్ పాలన కావాలా.? అని నిలదీశారు.. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్.. బీజేపీని ఏ నాడైనా ప్రశ్నించారా..? బీజేపీ ఇస్తున్నవి పాచిపోయిన లడ్డూలు అని విమర్శించి.. ఇప్పుడు ఎందుకు బీజేపీకి వంత పాడుతున్నారు.. పవన్ పాచిపోయిన లడ్డూలు తెచ్చి తిరుపతి వెంకన్న ముందు పెట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Chiru: బాలయ్య డైరెక్టర్ తో మెగా 157?
Also Read
ప్రత్యేక హోదా అంశంలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు శ్రీనివాసరావు.. ప్రత్యేక హోదాపై ప్రజలే నిరసనలు నిర్వహిస్తారన్నారు. ఇక, అన్నయ్య కాంగ్రెస్ కు అమ్మేస్తే.. పవన్ ఆర్ఎస్ఎస్ కు అమ్ముతావా? అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పార్టీని ఆర్ఎస్ఎస్ లో విలీనం చేస్తారా? అని ప్రశ్నించారు. జన సైనికులను పవన్ కల్యాణ్ మోసం చేస్తున్నారు.. జన సైనికులారా పవన్ కల్యాణ్ని ప్రశ్నించండి అంటూ పిలుపునిచ్చారు సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.
తాజావార్తలు
-
Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్కు సమంత బంపర్ ఆఫర్!
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!