Ponnam Prabhakar: బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పండని అన్నారు. బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ.. రిజర్వేషన్లకు వ్యతిరేక ఉండే బీజేపీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగేహక్కు లేదని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని తెలిపారు. తాము మండల కమిషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే.. మీరు దేశ వ్యాప్తంగా కమండల యాత్ర పెట్టి మండల కమిషన్ అమలును వ్యతిరేకించింది బీజేపీ కాదా…? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం కాదా…? అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కుల గణన సర్వే జరపాలని ఎవరికెంతో – వారికంత అని నినాదిస్తే.. ప్రభుత్వం తరుపున కుల గణన సర్వేకి సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా…? అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమానత్వం కోరుకునే వాళ్ళంతా నక్సలైట్లు అంటున్నారు.. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సమానత్వం కోరుకుంటే నక్సలైట్లు అవుతారా…? అని అన్నారు. సివిల్ సర్వీస్ లకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం కాదా..? అని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో సివిల్ సర్వీస్ లలో ఓబీసీలకు 27 % వాట దక్కాల్సి ఉండగా – దక్కిన వాట 15.92 %.. ఎస్సీలకు 15 % వాట దక్కాల్సి ఉండగా – దక్కిన వాట 7.65% మాత్రమేనని తెలిపారు. ఎస్టీలకు 7.5% వాట దక్కాల్సి ఉండగా – దక్కిన వాట 3.8% మాత్రమేనని అన్నారు.
Also Read
Mumbai Indians: ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ లేవు కాబట్టి.. కనీసం ఆ పనైనా చేయండి!
దేశ సంపద అంతా ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ పోర్టులు, పోర్టులు, జాతీయ రహదారులు.. అదానీ, అంబానీలకు అప్పగించి గతంలో ఎప్పుడూ లేని విధంగా మీ హయంలోనే 150 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చింది మీరు కాదా..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఉపర్ జై శ్రీరాం – అందర్ రిజర్వేషన్కు రాం రాం అంటున్నారన్నారు. మీరు ఎప్పుడూ పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తారు .. తెలంగాణలో గత ఎన్నికల్లో బలహీన వర్గాల నుండి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభ పక్ష పదవి కూడా బీసీలకు ఎందుకు ఇవ్వలేదన్నారు. మీరు ఈ 10 సంవత్సరాల్లో దళితులు, బడుగు బలహీన వర్గాల సంక్షమం కోసం తీసుకున్న ఒక్క కార్యక్రమం అయినా చేపట్టారా అని ప్రశ్నించారు. తెలంగాణకి సంబంధించి 7 మండలాలు, సీలేరు ప్రాజెక్ట్లను ఆర్డినెన్సు ద్వారా ఆంధ్రాకి అప్పగిస్తే కనీసం స్పందించారా..? అని అన్నారు.
తెలంగాణలో మీకు ఓటు అడిగే హక్కు లేదు.. మేం తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించాం. కానీ ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటుపై అవహేళన మాట్లాడుతూ అమరవీరులకు అవమానించిన కనీసం పార్లమెంట్లో ఉండి కూడా మీరు మాట్లాడలేదు… తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది..
తెలంగాణలో కుల గణన చేపట్టాం.. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం మేము ఎవరెంతో – వారికంత న్యాయం చేస్తామన్నారు. మీరు రాజకీయంగా గుజరాతీలకు తొత్తులుగా, బానిసలుగా పని చేయడం తప్ప తెలంగాణ విభజన హామీలు అమలు చేశారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!