Congress : అధిష్టానానికి కాంగ్రెస్ నుంచి ఎంపీ స్థానాలకు పోటీ చేసే వారి లిస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం పార్లమెంటు సీటు పై పలువురి కన్ను పడింది. కాంగ్రెస్ లోని ముఖ్యులు ఈసీటుకోసం ప్రయత్నాలు ప్రారంబించారు. ఇందులో బాగంగా పది మంది లిస్టును జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించింది. మరో వైపున ఖమ్మం ఎంపి గా సీటు మల్లు నందినికి ఇవ్వాలని కోరుతు గాంధీ భవన్ లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. అలా అందించిన వారు అంతా భట్టి వర్గీయులు .. అయితే జిల్లా కాంగ్రెస్ పార్టీ మాత్రం పది మంది లిస్టును పార్టీ అధిష్టానానికి ఇచ్చారు. ఇలా ఇచ్చిన వారిలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ లకు సీటు ఇవ్వాలని కోరారు. అదే విదంగా జిల్లా నుంచి పోటీ పడుతున్న వారి జాబితాను కూడ అధిష్టానం ఇచ్చింది. ఇలా ఇచ్చిన వారి లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కొడుకు తుమ్మల యుగందర్ ఉన్నారు.
వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి లతో పాటుగా మాజి మంత్రి రేణుక చౌదరి, మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నేత వి హెచ్ హనుమంత రావు, కాంగ్రెస్ సీనియర్ నేతకుసుమ కుమార్ లతో పాటుగా గతంలో ఎంఎల్ సి పదవికి పోటీచేసి ఓటమిపాలు అయిన రాయల నాగేశ్వరరావు, మాజీ ఎంఎల్ సి పోట్ల నాగేశ్వరరావు పేర్ల తో కూడిన ఒక్క నివేదిక ను కాంగ్రెస్ అధిష్టానానికి జిల్లా కాంగ్రస్ పార్టీ పంపించింది. వీరంతా ఆశావహులని డీసీసీ పేర్కొంది. రెండు రోజుల క్రితం జరిగిన పీఏసీ సమావేశంలో ఈ పేర్లను ఇచ్చినట్లుగా తెలుస్తోంది… ఇది ఇలా ఉంటే ఈ రోజు మాత్రం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని అదే విదంగా రాజ్యసభ మాజీ ఎంపి వి హెచ్ హనుమంత రావు లు కూడ గాంధీభవన్ లో దరఖాస్తుచేసుకున్నారు. మల్లు నందిని తరపున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస రెడ్డి వడ్డె నారాయణ రావు గాంధీ భవన్ లో ధరకాస్తు అందించారు.. వ్యాపార వేత్త వివిసి రాజేంద్ర ప్రసాద్ కూడ గాంధీ బవన్ లో తనకు ఖమ్మం ఎంపి సీటు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!