India FDI Rules: మారిన రూల్స్.. చైనా సహా పొరుగు దేశాలకు FDI నిబంధనల సడలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India FDI Rules: భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సవరించిన మార్గదర్శకాల ప్రకారం, చైనాతో పాటు ఇతర పొరుగు దేశాల నుండి పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు కొన్ని నిబంధనలను సడలించారు. దీంతో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.
ఈ దేశాలకు లాభం
ఈ మార్పులతో ప్రభావితమయ్యే దేశాల్లో చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. గతంలో ఈ దేశాల పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉండేది. అయితే తాజా మార్పులతో ఈ ప్రక్రియను సులభతరం చేశారు. దీంతో వ్యాపార లావాదేవీలు వేగవంతమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
చైనా పెట్టుబడులు ఎంత?
భారతదేశంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో చైనా వాటా చాలా తక్కువగానే ఉంది. డిసెంబర్ 2025 నాటికి చైనా వాటా కేవలం 0.32 శాతం మాత్రమే. ఏప్రిల్ 2000 నుండి ఇప్పటివరకు చైనా నుంచి వచ్చిన మొత్తం FDI విలువ సుమారు 2.51 బిలియన్ అమెరికన్ డాలర్లు. అయితే, 2020లో జరిగిన గాల్వన్ లో భారత-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం TikTok మరియు WeChat సహా అనేక చైనీస్ యాప్లను నిషేధించింది.
ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదల
రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్-చైనా వాణిజ్యం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం చైనా, భారతదేశానికి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత ఎగుమతులు US$14.25 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు US$113.45 బిలియన్లుకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు US$99.2 బిలియన్లుగా నమోదైంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత ఎగుమతులు US$15.88 బిలియన్లుగా ఉండగా, దిగుమతులు US$108.18 బిలియన్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు US$92.3 బిలియన్లుగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!