India FDI Rules: మారిన రూల్స్.. చైనా సహా పొరుగు దేశాలకు FDI నిబంధనల సడలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India FDI Rules: భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సవరించిన మార్గదర్శకాల ప్రకారం, చైనాతో పాటు ఇతర పొరుగు దేశాల నుండి పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు కొన్ని నిబంధనలను సడలించారు. దీంతో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.
ఈ దేశాలకు లాభం
ఈ మార్పులతో ప్రభావితమయ్యే దేశాల్లో చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. గతంలో ఈ దేశాల పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉండేది. అయితే తాజా మార్పులతో ఈ ప్రక్రియను సులభతరం చేశారు. దీంతో వ్యాపార లావాదేవీలు వేగవంతమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
చైనా పెట్టుబడులు ఎంత?
భారతదేశంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో చైనా వాటా చాలా తక్కువగానే ఉంది. డిసెంబర్ 2025 నాటికి చైనా వాటా కేవలం 0.32 శాతం మాత్రమే. ఏప్రిల్ 2000 నుండి ఇప్పటివరకు చైనా నుంచి వచ్చిన మొత్తం FDI విలువ సుమారు 2.51 బిలియన్ అమెరికన్ డాలర్లు. అయితే, 2020లో జరిగిన గాల్వన్ లో భారత-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం TikTok మరియు WeChat సహా అనేక చైనీస్ యాప్లను నిషేధించింది.
ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదల
రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్-చైనా వాణిజ్యం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం చైనా, భారతదేశానికి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత ఎగుమతులు US$14.25 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు US$113.45 బిలియన్లుకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు US$99.2 బిలియన్లుగా నమోదైంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత ఎగుమతులు US$15.88 బిలియన్లుగా ఉండగా, దిగుమతులు US$108.18 బిలియన్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు US$92.3 బిలియన్లుగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!