India FDI Rules: మారిన రూల్స్.. చైనా సహా పొరుగు దేశాలకు FDI నిబంధనల సడలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India FDI Rules: భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సవరించిన మార్గదర్శకాల ప్రకారం, చైనాతో పాటు ఇతర పొరుగు దేశాల నుండి పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు కొన్ని నిబంధనలను సడలించారు. దీంతో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.
ఈ దేశాలకు లాభం
ఈ మార్పులతో ప్రభావితమయ్యే దేశాల్లో చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. గతంలో ఈ దేశాల పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉండేది. అయితే తాజా మార్పులతో ఈ ప్రక్రియను సులభతరం చేశారు. దీంతో వ్యాపార లావాదేవీలు వేగవంతమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
చైనా పెట్టుబడులు ఎంత?
భారతదేశంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో చైనా వాటా చాలా తక్కువగానే ఉంది. డిసెంబర్ 2025 నాటికి చైనా వాటా కేవలం 0.32 శాతం మాత్రమే. ఏప్రిల్ 2000 నుండి ఇప్పటివరకు చైనా నుంచి వచ్చిన మొత్తం FDI విలువ సుమారు 2.51 బిలియన్ అమెరికన్ డాలర్లు. అయితే, 2020లో జరిగిన గాల్వన్ లో భారత-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం TikTok మరియు WeChat సహా అనేక చైనీస్ యాప్లను నిషేధించింది.
ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదల
రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్-చైనా వాణిజ్యం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం చైనా, భారతదేశానికి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత ఎగుమతులు US$14.25 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు US$113.45 బిలియన్లుకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు US$99.2 బిలియన్లుగా నమోదైంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత ఎగుమతులు US$15.88 బిలియన్లుగా ఉండగా, దిగుమతులు US$108.18 బిలియన్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు US$92.3 బిలియన్లుగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!