Congress: సాయంత్రం సీఈసీ భేటీ.. అమేథీ, రాయ్బరేలీ స్థానాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమేథీ, రాయ్బరేలీ స్థానాలపై కాంగ్రెస్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే స్థానాలు గాంధీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నాయి. ఈసారి సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు. దీంతో ఆమె రాయ్బరేలీ స్థానం ఖాళీ అయింది. ఇక అమేథీ నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. దీనిపై కూడా తర్జనభర్జన జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈసారి పోటీ చేస్తారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ నామినేషన్ వేశారు. దీంతో అమేథీలో రాహుల్ పోటీపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు అమేథీ నుంచి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీలోకి దిగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఈసీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Bandi Snajay: అలా నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుని.. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా..
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ఇదిలా ఉంటే వరుణ్గాంధీని రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగాలని బీజేపీ ప్రతిపాదించింది. ఇందుకు వరుణ్గాంధీ నిరాకరించారు. గతంలో ఆయన పిలిభిత్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించింది. తన సోదరిపై పోటీ చేసే ఉద్దేశం లేకనే ఆయన నిరాకరించినట్లు సమాచారం. ఇక్కడ సోనియాగాంధీ నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. కానీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆమె తప్పుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. తదుపరి పోలింగ్ మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. అమేథీలో మాత్రం మే 20న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Malla Reddy: నువ్వే గెలుస్తావన్న మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్.. కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?