Congress: మధ్యప్రదేశ్ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శనివారం దేశ రాజధానిలో జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా హాజరయ్యారు.
Also Read: Bihar Politics: ఒవైసీ భయం బీహార్ సీఎంను కలవరపెడుతోందా?
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అంతకుముందు అక్టోబర్ 3న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను నిర్ణయించేందుకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఎన్నికల పోరుకు ముందు అధికార బీజేపీ, కాంగ్రెస్లు పరస్పరం కుండబద్దలు కొట్టుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.రెండు పార్టీలు తమ అగ్రనేతలను, ప్రచార నాయకులను రంగంలోకి దించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ ప్రచారానికి నాయకత్వం వహిస్తుండగా.. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఇతర ప్రముఖ నాయకులు ఓటర్లను గెలవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్నారు.
Also Read: Rahul Gandhi: నవయుగ రావణ్ రాహుల్.. బీజేపీ పోస్ట్ వైరల్, కోర్టుకెళ్లిన కాంగ్రెస్
మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే రెండు అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది. వారి రెండవ జాబితాలో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తేతో సహా రాష్ట్రంలోని అనేక మంది బీజేపీ ప్రముఖులు ఉన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ, ఆయన సోదరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటికే రాష్ట్రంలో ర్యాలీలను నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది అక్టోబరు నుంచి నవంబరు మధ్య కాలంలో ఎన్నికలు జరగనుండగా, 230 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు శాసనసభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!