Rahul Gandhi: నవయుగ రావణ్ రాహుల్.. బీజేపీ పోస్ట్ వైరల్, కోర్టుకెళ్లిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లంకాధిపతి రావణుడి అవతారంలో ఉన్న రాహుల్ గాంధీ ఫోటోను షేర్ చేస్తూ బీజేపీ వివాదాస్పద క్యాప్షన్ను జోడించింది. నవయుగ రావణుడిగా రాహుల్ను చూపిస్తూ బీజేపీ సోషల్ మీడియా పోస్ట్పై ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ వివాదాస్పద పోస్ట్పై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ నాయకుడు జస్వంత్ గుర్జార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: India-Canada Row: ఇండియా-కెనడా వివాదంపై స్పందించిన రిషి సునాక్.. ఏమన్నారంటే..?.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ఇద్దరు బీజేపీ నేతలపై ఐపీసీ సెక్షన్ 499 (మరొకరిపై తప్పుడు అభియోగం), 500 (పరువు నష్టం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ రాజస్థాన్ యూనిట్ ప్రధాన కార్యదర్శి జస్వంత్ గుర్జార్ తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు-11లో జస్వంత్ గుర్జార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై అక్టోబర్ 9న వాదనలు వినాలని కోర్టు నిర్ణయించింది. ఎక్స్ ఒకప్పుడు ట్విట్టర్లో బీజేపీ అధికారిక హ్యాండిల్ నుంచి పోస్ట్ చేయబడిన ఒక పోస్టర్లో రాహుల్ గాంధీ ఫోటోను రావణుడిగా చూపించడంవివాదాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం జరిగింది. ఇది ఆమోదయోగ్యం కాదు, నిస్సందేహంగా ప్రమాదకరమైనది అని కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలను రేకెత్తించింది.
Also Read: Russia: కిమ్-పుతిన్ భేటీ తర్వాత పెరిగిన రైళ్ల రాకపోకలు.. కారణం అదేనా..?
పిటీషన్ను కోర్టు అంగీకరించిందని, కేసు విచారణను అక్టోబర్ 9 న షెడ్యూల్ చేయబడిందని జస్వంత్ గుర్జార్ చెప్పారు. అక్టోబరు 5న నిందితుడు ఉద్దేశపూర్వకంగా పోస్ట్ను దురుద్దేశంతో ప్రచారం చేశాడని, నిందితుడి లక్ష్యం కాంగ్రెస్, దానితో సంబంధం ఉన్న వ్యక్తుల చిత్తశుద్ధిని అవమానించడం, దెబ్బతీయడం, రాజకీయ లబ్ధి పొందడం అని పిటిషన్లో పేర్కొనబడింది. బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీని రాముడికి వ్యతిరేకిగా, మత విరోధిగా చిత్రీకరించి ప్రజలను రెచ్చగొట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. నిందితులిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసి విచారణ జరిపించాలని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ పోస్టర్పై దేశవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది.
“భారత్ ఖత్రే మే హై – కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్. జార్జ్ సోరోస్ దర్శకత్వం వహించాడు” అనే టైటిల్తో గాంధీని పోస్టర్లో అనేక మంది తలలు చూపించారు.’నవయుగం రావణుడు వచ్చాడు. అతడు దుర్మార్గుడు. ధర్మ వ్యతిరేకి. రాముడి వ్యతిరేకి. భారత్ను నాశనం చేయడమే అతని లక్ష్యం’ అని పోస్టర్తో పాటు బీజేపీ పోస్ట్ చేసింది. హంగేరియన్లో జన్మించిన అమెరికన్ ఫైనాన్షియర్, పరోపకారి, కార్యకర్త అయిన జార్జ్ సోరోస్, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నుంచి నిప్పులు చెరిగారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!