Seethakka: రాముడిని కూడా రాజకీయాల్లోకి లాగిన పార్టీ.. బీజేపీ
Seethakka: బీజేపీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తప్పుడు ప్రచారం కాంగ్రెస్ నేతలు ఏడీజీకి వినతిపత్రం అందించారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఏడీజీ సంజయ్ కుమార్ జైన్ను కలిసి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టూ జీ స్కామ్ , కోల్డ్ స్కామ్లో తప్పు చేయలేదని విచారణ సంస్థలే ప్రకటించాయన్నారు. తప్పు జరగలేదని విచారణ సంస్థలు చెప్పినా భారీ కుంభకోణాలు జరిగాయని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెట్టాలని ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు.
అసత్య పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సైనికుల త్యాగాలను తమ త్యాగాలుగా చెప్పుకొని బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని ఆమె ఆరోపించారు. రామున్ని కూడా రాజకీయాల్లో లాగిన దుర్మార్గపు పార్టీ బీజేపీ అని ఆమె మండిపడ్డారు. బీజేపీ నేతలకు నీతి, జాతి ఉంటే ఆదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని సీతక్క డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేశారా?.. ప్రియాంక గాంధీ ప్రభుత్వంలో పని చేశారా? .. వారిపై ఇలా ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. దేశ సంపద దోచుకోవడానికి బీజేపీ అదానీని అడ్డం పెట్టుకుందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నోరు నొక్కాలని బీజేపీ తప్పుడు ఆలోచనలు చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఇమేజ్ని దెబ్బతీయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ప్రధాని మోడీ ఒక సూటు కోసమే కోట్లు ఖర్చు చేస్తున్నారని.. మోడీ జీవితం.. రాహుల్ గాంధీ జీవితాన్ని జనం ముందు పెడదాం రండి అంటూ సవాల్ విసిరారు.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
Read Also: Minister Ktr: ఇల్లు చల్లగా ఉండేలా కూల్ రూఫ్.. ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
బీజేపీ అధికారంలోకి వచ్చాక పౌరుల హక్కులను, పార్లమెంటు సభ్యుల హక్కులను కూడా కాలరాస్తోందన్నారు. కేసీఆర్కు దేశానికి ఎన్నికల ఖర్చులు ఇచ్చే డబ్బులు ఎలా వచ్చాయో తేలాలని సీతక్క డిమాండ్ చేశారు. కేసీఆర్ తొమ్మిదేళ్ల పరిపాలన పైన విచారణ జరపాలన్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!