Seethakka: రాముడిని కూడా రాజకీయాల్లోకి లాగిన పార్టీ.. బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seethakka: బీజేపీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తప్పుడు ప్రచారం కాంగ్రెస్ నేతలు ఏడీజీకి వినతిపత్రం అందించారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఏడీజీ సంజయ్ కుమార్ జైన్ను కలిసి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టూ జీ స్కామ్ , కోల్డ్ స్కామ్లో తప్పు చేయలేదని విచారణ సంస్థలే ప్రకటించాయన్నారు. తప్పు జరగలేదని విచారణ సంస్థలు చెప్పినా భారీ కుంభకోణాలు జరిగాయని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెట్టాలని ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు.
అసత్య పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సైనికుల త్యాగాలను తమ త్యాగాలుగా చెప్పుకొని బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని ఆమె ఆరోపించారు. రామున్ని కూడా రాజకీయాల్లో లాగిన దుర్మార్గపు పార్టీ బీజేపీ అని ఆమె మండిపడ్డారు. బీజేపీ నేతలకు నీతి, జాతి ఉంటే ఆదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని సీతక్క డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేశారా?.. ప్రియాంక గాంధీ ప్రభుత్వంలో పని చేశారా? .. వారిపై ఇలా ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. దేశ సంపద దోచుకోవడానికి బీజేపీ అదానీని అడ్డం పెట్టుకుందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నోరు నొక్కాలని బీజేపీ తప్పుడు ఆలోచనలు చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఇమేజ్ని దెబ్బతీయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ప్రధాని మోడీ ఒక సూటు కోసమే కోట్లు ఖర్చు చేస్తున్నారని.. మోడీ జీవితం.. రాహుల్ గాంధీ జీవితాన్ని జనం ముందు పెడదాం రండి అంటూ సవాల్ విసిరారు.
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
Read Also: Minister Ktr: ఇల్లు చల్లగా ఉండేలా కూల్ రూఫ్.. ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
బీజేపీ అధికారంలోకి వచ్చాక పౌరుల హక్కులను, పార్లమెంటు సభ్యుల హక్కులను కూడా కాలరాస్తోందన్నారు. కేసీఆర్కు దేశానికి ఎన్నికల ఖర్చులు ఇచ్చే డబ్బులు ఎలా వచ్చాయో తేలాలని సీతక్క డిమాండ్ చేశారు. కేసీఆర్ తొమ్మిదేళ్ల పరిపాలన పైన విచారణ జరపాలన్నారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!