Tulasi Reddy: రైతులను ఏడిపిస్తే ప్రభుత్వం మాడి మసైపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ తులసిరెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాడు బిగించడమే అని అభిప్రాయపడ్డారు. ఇది ఖచ్చితంగా ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే అంటూ మండిపడ్డారు. రైతుల శ్రేయస్సు కోసం ఆనాడు వైఎస్ఆర్ ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి నీరు గారుస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే సీఎం జగన్ తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాల వలన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని తులసిరెడ్డి విమర్శించారు. రైతులను ఏడిపిస్తే వైసీపీ ప్రభుత్వం మాడి మసైపోక తప్పదని హెచ్చరించారు. రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బట్టి పొత్తులపై ఆలోచిస్తామని తులసిరెడ్డి అన్నారు. పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రానికి నెంబర్ ఒన్ ద్రోహి బీజేపీ అయితే. .నంబర్ టు ద్రోహి వైసీపీ అని ఆరోపించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం చిత్తశుద్ధి లేని చర్యగా తులసిరెడ్డి అభివర్ణించారు. ఆత్మకూరు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
Also Read
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!