Tulasi Reddy: రైతులను ఏడిపిస్తే ప్రభుత్వం మాడి మసైపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ తులసిరెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాడు బిగించడమే అని అభిప్రాయపడ్డారు. ఇది ఖచ్చితంగా ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే అంటూ మండిపడ్డారు. రైతుల శ్రేయస్సు కోసం ఆనాడు వైఎస్ఆర్ ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి నీరు గారుస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే సీఎం జగన్ తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాల వలన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని తులసిరెడ్డి విమర్శించారు. రైతులను ఏడిపిస్తే వైసీపీ ప్రభుత్వం మాడి మసైపోక తప్పదని హెచ్చరించారు. రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బట్టి పొత్తులపై ఆలోచిస్తామని తులసిరెడ్డి అన్నారు. పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రానికి నెంబర్ ఒన్ ద్రోహి బీజేపీ అయితే. .నంబర్ టు ద్రోహి వైసీపీ అని ఆరోపించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం చిత్తశుద్ధి లేని చర్యగా తులసిరెడ్డి అభివర్ణించారు. ఆత్మకూరు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
తాజావార్తలు
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!