Andhra Pradesh: ప్రభుత్వ ప్రకటనతో ఆందోళన పడుతున్న రైతాంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు త్వరలోనే మీటర్లు ఏర్పాటుచేస్తామన్న ఏపీ ప్రభుత్వ ప్రకటనలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020 డిసెంబరు నుండి రైతుల బోర్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావటంతో భవిష్యత్లో ఏం జరుగుతుందోనని రైతాంగంలో చర్చ మొదలైంది. మీటర్ల ఏర్పాటుకు అంగీకార పత్రాలపై రైతులు సంతకాలు చేయకుంటే ఉన్న కనెక్షన్లు తొలగిస్తామని పలు చోట్ల విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసి సంతకాలు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రకాశం జిల్లాలోని ఏడు డివిజన్ల పరిధిలో 1,92,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1,56,052 మంది రైతుల వద్ద నుండి మీటర్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ అధికారులు అంగీకార పత్రాలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా మరో 25 వేల మంది రైతుల వద్ద నుండి అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉంది.. వచ్చే 30 ఏళ్ల పాటు రైతులకు విద్యుత్ రాయితీ ఇస్తామని ప్రకటించినప్పటికీ నగదు బదిలీ పథకం అమలులో దీనిని రద్దు చేస్తారని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 3 హార్స్ పవర్ గల మోటార్లకు 2,500 నుంచి 3,500 వరకు బిల్లు వస్తుంది. ప్రభుత్వం ఇంత మొత్తంలో నగదును నేరుగా తమ ఖాతాలకు జమచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
మరోవైపు శ్రీకాకుళం తరువాత ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ప్రక్రియకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పటికే కనిగిరి డివిజన్ సీఎస్పురం పరిధిలో 300, ఒంగోలు డివిజన్ కొత్తపట్నం పరిధిలో 103 మీటర్లు పైలట్ ప్రాజెక్టు కింద అమర్చారు. విద్యుత్ మీటర్ల నిర్ణయంతో రైతులు మరింత నష్టపోతామని పలువురు రైతులు భావిస్తున్నారు. రైతులు వినియోగించే ఉచిత వ్యవసాయ విద్యుత్పై ఎలాంటి పరిమితి ఉండదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. వారి ఖాతాలోకి నేరుగా ప్రతి నెల నగదును ప్రభుత్వం జమ చేస్తుందని.. దానిని వారు విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందంటున్నారు.
అయితే భవిష్యత్తులో విద్యుత్ వినియోగంపై పరిమితి విధిస్తే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. ప్రభుత్వం నగదు బదిలీ జమ చేయడం ఆలస్యమై సరఫరాను అధికారులు నిలిపేస్తే తమ పంటల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మార్చిలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల ప్రయోగాత్మకంగా వ్యవసాయ మోటార్లకు 103 స్మార్ట్ మీటర్లు అమర్చారు. ఇంతవరకు స్తంభాల నుంచి ఈ మీటర్లకు సంబంధించి అనుసంధానం చేయక పోవటంతో పాత పద్ధతే అమలవుతోంది. బోర్లకు మీటర్లు ఏర్పాటు చేసిన తర్వాత రీడింగ్ ఎక్కువ తిరిగినా.. రైతు ఖాతాల్లో నగదు జమ కాకపోయినా.. అది మీరే చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేస్తే తమ పరిస్దితేంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటర్లలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి వెంటనే పరిష్కరించకపోతే బకాయిల పేరిట ఆర్థిక భారం పెరిగిపోతుందని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Asani Cyclone: దిశ మార్చుకున్న ‘అసని’.. ఏపీకి తప్పనున్న ముప్పు
తాజావార్తలు
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
-
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!