Congress: నేటితో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి నేటి సరిగ్గా వంద రోజులు అవుతుంది. గతేడాది డిసెంబర్ 7వ తేదీన పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వంద రోజుల ప్రగతి నివేదనను రిలీజ్ చేసింది. డిసెంబరు 7న ప్రగతిభవన్ దగ్గర కంచెను తొలగించి తమ ప్రభుత్వ నిర్వహణ తీరుపై సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రగతి భవన్ పేరును మహాత్మ జ్యోతిభా ఫూలే భవన్గా మార్చి.. అక్కడ ప్రజావాణి కార్యక్రమానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. వారంలో రెండు రోజులు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తూ.. ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.
Read Also: Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
కాగా, వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లూ ప్రధానంగా దృష్టి పెట్టింది. అభయ హస్తంలోని 13 కార్యక్రమాల్లో ఐదు పథకాలను వంద రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజాపాలన పేరుతో గ్రామ, పట్టణ సభలు నిర్వహించి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నట్లు గణాంకాల్లో తేలింది. ఆరోగ్య శ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, అలాగే, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది.
Read Also: Tenth Exams: టెన్త్ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రశ్నా పత్రానికి క్యూఆర్ కోడ్..!
ఇక, సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని ఈ వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకు నెలకు 2 వేల 500 రూపాయలు, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు, వరి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం త్వరలో అమలు కావాల్సి ఉంది. ఇళ్లు లేని పేదలకు స్థలం, రూ. 5 లక్షలు, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు.. కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక, ఉద్యోగాల విషయంలో రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. 29 వేల 384 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను సైతం అందించారు. అలాగే, సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలతో పాటు TSPSC బోర్డును ప్రక్షాళన చేసి.. కొత్త ఛైర్మన్గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది. గ్రూప్-1 పాత నోటిఫికేషన్ను రద్దు చేసి మరో 563 ఉద్యోగాలతో కొత్త ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11 వేల 62 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేష్ రిలీజ్ చేసింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!