Telangana Congress : ఈటెల రాజేందర్ పై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కాంగ్రెస్ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై కాంగ్రెస్ నేతలు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. యాత్రకు వచ్చే ఆదరణ చూడలేకే బీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ నేతపై దాడి, భూపాలపల్లి సభపై దాడి వారి అరాచకానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. మాపై దాడులు చేస్తే బీఆర్ఎస్ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. స్థానికంగా ఇసుక దోపిడీ పెరిగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ వస్తున్నారని తెలుసుకుని డంపింగ్ పనులు ఆపేశారని ఆయన విమర్శించారు. అనుమతులకు మించి ఇసుక తరలింపు జరుగుతుందని ఆయన మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, అక్రమంగా రోడ్లు వేసి మరీ ఇసుక తరలించుకు పోతున్నారని ధ్వజమెత్తారు.
Also Read : India vs Pakistan: భారత్కు శివరాత్రి పాక్కు కాళరాత్రి.. సచిన్ శివతాండవానికి 20 ఏళ్లు.
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
కేటీఆర్ పర్యటన ఉండగా బీజేపీ ఎమ్మెల్యే సభకు అనుమతులు ఎలా ఇచ్చారని, కాంగ్రెస్ నేతలను మాత్రమే ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఆయన అన్నారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. దొరను ఓడించాలని రాజేందర్ ను గెలిపిస్తే.. ప్రజలకు ఒరిగిందేంటి? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ అక్రమాలపై ఇప్పటి వరకు ఇక్కడి ఎమ్మెల్యే పోరాడటం లేదని, ఈటల తన అక్రమాల్లో వాటా ఇచ్చినందుకే బీఆర్ఎస్ లో ఆయన్ను అందలం ఎక్కించారని ఆయన విమర్శించారు.
Also Read : Pattabhi Bail Petition:టీడీపీ నేత పట్టాభి బెయిల్ పిటిషన్ పై వాదనలు
ఈటల ఏనాడు రోడ్డెక్కి పోరాడింది లేదని, ఈటల పౌరసరఫరాల మంత్రిగా ఉండగా బియ్యం స్కాంలో డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. చీకటి ఒప్పందాలు, చీకటి వ్యాపారాలు బయటపడతాయనే ఈటల బీజేపీలో చేరారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కాంలే కానీ.. ప్రభుత్వ స్కీములు ప్రజలకు చేరడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ దొంగ కౌశిక్కు ఎమ్మెల్సీ ఇచ్చిందని, బీఆర్స్, బీజేపీ లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!