Telangana Congress : ఈటెల రాజేందర్ పై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కాంగ్రెస్ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై కాంగ్రెస్ నేతలు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. యాత్రకు వచ్చే ఆదరణ చూడలేకే బీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ నేతపై దాడి, భూపాలపల్లి సభపై దాడి వారి అరాచకానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. మాపై దాడులు చేస్తే బీఆర్ఎస్ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. స్థానికంగా ఇసుక దోపిడీ పెరిగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ వస్తున్నారని తెలుసుకుని డంపింగ్ పనులు ఆపేశారని ఆయన విమర్శించారు. అనుమతులకు మించి ఇసుక తరలింపు జరుగుతుందని ఆయన మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, అక్రమంగా రోడ్లు వేసి మరీ ఇసుక తరలించుకు పోతున్నారని ధ్వజమెత్తారు.
Also Read : India vs Pakistan: భారత్కు శివరాత్రి పాక్కు కాళరాత్రి.. సచిన్ శివతాండవానికి 20 ఏళ్లు.
Also Read
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
కేటీఆర్ పర్యటన ఉండగా బీజేపీ ఎమ్మెల్యే సభకు అనుమతులు ఎలా ఇచ్చారని, కాంగ్రెస్ నేతలను మాత్రమే ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఆయన అన్నారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. దొరను ఓడించాలని రాజేందర్ ను గెలిపిస్తే.. ప్రజలకు ఒరిగిందేంటి? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ అక్రమాలపై ఇప్పటి వరకు ఇక్కడి ఎమ్మెల్యే పోరాడటం లేదని, ఈటల తన అక్రమాల్లో వాటా ఇచ్చినందుకే బీఆర్ఎస్ లో ఆయన్ను అందలం ఎక్కించారని ఆయన విమర్శించారు.
Also Read : Pattabhi Bail Petition:టీడీపీ నేత పట్టాభి బెయిల్ పిటిషన్ పై వాదనలు
ఈటల ఏనాడు రోడ్డెక్కి పోరాడింది లేదని, ఈటల పౌరసరఫరాల మంత్రిగా ఉండగా బియ్యం స్కాంలో డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. చీకటి ఒప్పందాలు, చీకటి వ్యాపారాలు బయటపడతాయనే ఈటల బీజేపీలో చేరారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కాంలే కానీ.. ప్రభుత్వ స్కీములు ప్రజలకు చేరడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ దొంగ కౌశిక్కు ఎమ్మెల్సీ ఇచ్చిందని, బీఆర్స్, బీజేపీ లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
తాజావార్తలు
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా..?
-
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!