India vs Pakistan: భారత్కు శివరాత్రి పాక్కు కాళరాత్రి.. సచిన్ శివతాండవానికి 20 ఏళ్లు.
India vs Pakistan: సరిగ్గా 20 ఏళ్ల క్రితం మార్చి 1, 2003 ప్రపంచ కప్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎవరూ మరిచిపోరు. శివరాత్రి రోజే సచిన్ టెండూల్కర్ శివాలెత్తి పాకిస్తాన్ పై ఆడాడు. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ టీమ్ పై శివతాండమే చేశాడు. వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్ వంటి బౌలర్లను చీల్చి చెండాడాడు. భారీ స్కోర్ సాధించి, భారత్ ను ఓడిద్దాం అని అనుకున్న పాకిస్తాన్ కు సచిన్ చుక్కలు చూపించాడు. భారత్ కు శివరాత్రి, పాకిస్తాన్ కు కాళరాత్రిని మిగిల్చిన ఈ మ్యాచు చరిత్రలో చాలా ప్రత్యేకం.
2003 ఐసీసీ ప్రపంచకప్ మ్యాచులో భారత్, పాకిస్తాన్ తో తలపడింది. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. గ్రూప్ ఏలో తిరుగులేని విజయాలతో ఆస్ట్రేలియా మొదటిస్థానంలో ఉండగా.. తరువాతి రౌండ్ క్వాలిఫైయింగ్ బెర్త్ కోసం భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్యలో మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత్ ముందు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పాక్ ఓపెనర్ సయీద్ అన్వర్ 126 బాల్స్ లో 101 పరుగులు చేసి భారీ స్కోరుకు కారణం అయ్యాడు. అయితే అప్పటి వరకు భారత్ కు 222 కంటె ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఎన్నడూ కూడా విజయవంతంగా ఛేదించలేకపోయిన భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. గెలుపు తమదే అనే ధీమాతో పాక్ ఉంది. అయితే వాళ్లకు అప్పుడు తెలియదు శివతాండవం ఉంటుందని.
Also Read
- Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
- PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
- Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?
- Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
Read Also: IND vs AUS: మూడో టెస్టులో గట్టి పోటీ.. ఆధిక్యంలో ఆసీస్ జట్టు
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్ జోడిగా వచ్చారు. ఇద్దరు వచ్చీ రావడంతోనే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 5 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేశారు. టీ 20 ఫార్మాట్ అంతగా అందుబాటులోకి రాని రోజుల్లోనే హిట్టింగ్ చేస్తూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్ లో సచిన్ ఆడిన అప్పర్ కట్ షాట్ ఇప్పటికే ఓ క్లాసిక్. సచిన్ ఆడిన షాట్ నే మళ్లీ సెహ్వాగ్ పాక్ బౌలర్లకు రుచి చూపాడు. సెహ్వాగ్, కెప్టెన్ గంగూలీ వికెట్లు త్వరగానే పడిపోయినా.. మహ్మద్ కైఫ్, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్ జట్టును విజయతీరాలకు చేర్చి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ మ్యాచులో సచిన్ కేవలం 75 బంతుల్లోనే 98 పరుగులు చేయడంతో పాటు వన్డేల్లో 12,000 పరుగులను పూర్తి చేశాడు.
27వ ఓవర్ లో షాహీద్ అఫ్రీదీ బౌలింగ్ లో సచిన్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆ తరువాత ద్రావిడ్ 44 పరుగులతో, యువరాజ్ సింగ్ 50 పరుగులు చేసి భారత్ ను గెలిపించారు. 6 వికెట్ల నష్టానికి మరో 26 బాల్స్ మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!