Anantapur Lok Sabha: ఆ ఎంపీ సీటుపై టీడీపీలో స్పష్టత కరువు.. తెరపైకి రోజుకో పేరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur Lok Sabha: అనంతపురం పార్లమెంటు స్థానంపై టీడీపీలో సందిగ్ధత నెలకొంది. ఇక్కడ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్నదానిపై ఇంకా స్పష్టతరాలేదు. కానీ రోజుకు ఒక పేరు మాత్రం తెరపైకి వస్తోంది. అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్లో బోయ సామాజికవర్గం ఎక్కువ. ఇక్కడ కురుబ సామాజికవర్గం కూడా ఉంది. గతంలో బోయ సామాజికవర్గానికి టికెట్ ఇచ్చి వైసిపి సక్సెస్ అయింది. ఈసారి కురుబ కులానికి చెందిన శంకర్ నారాయణకు టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం కూడా అదే ట్రెండ్ ఫాలో కావాలని చూస్తోంది. కానీ కురుబ సామాజికవర్గానికి చెందిన బి.కె పార్థసారథికి హిందూపురం పార్లమెంట్ స్థానం కేటాయించింది. దీంతో అనంతపురం పార్లమెంటు స్థానంలో ఎవరికైనా బీసీకి ఇస్తారా?అనే ప్రచారం జరుగుతోంది.
Read Also: Kurnool TDP: టీడీపీకి తలనొప్పిగా కర్నూలు.. ఐదు నియోజకవర్గాల్లో అదే తీరు..!
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఇప్పటికే బోయ సామాజికవర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులుకు రాయదుర్గం టికెట్ కేటాయించింది. ఇటు గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు దాదాపుగా టికెట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఒకే పార్లమెంటు సెగ్మెంట్లో రెండు అసెంబ్లీ స్థానాలు బోయలకు ఇచ్చింది. ఇప్పుడు పార్లమెంటు స్థానం బోయలకు కాకుండా బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జెసి పవన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ రెడ్డి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అదే సమయంలో బోయల్ని కూడా పరిశీలిస్తోంది. సామాజికవర్గానికి చెందిన కమ్మూరి నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, మాజీ జడ్పీ ఛైర్మన్ పూల నాగరాజు పేరు కూడా తెరపైకి వచ్చింది. వీళ్లంతా బోయ సామాజికవర్గానికి చెందిన నేతలే. వీళ్ల పేరు మీదుగా కూడా సర్వేలు నిర్వహిస్తోంది టీడీపీ.
Read Also: Virat Kohli: ‘ఛీటర్-ఛీటర్’ అంటూ నినాదాలు.. కోహ్లీ హృదయాన్ని ముక్కలు చేసిన భారత ఫాన్స్!
హిందూపురానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ పేరు తెరపైకి వచ్చింది. ఆయన బోయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. దశాబ్దంన్నర కాలంగా తెలుగుదేశంలో పనిచేస్తున్నారు లక్ష్మీనారాయణ. ఐతే…అభ్యర్థుల ఎంపికలో టీడీపీ తడబాటు కనిపిస్తుండటంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి శంకర్ నారాయణ రెండు నెలలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. తెలుగుదేశంలో మాత్రం ఇలా కన్ఫ్యూజన్లోనే ఉంది. ఈనెల 28న టిడిపి అధినేత చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటనలోపు టికెట్పై స్పష్టత ఇస్తారా? లేదా?అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
-
Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్!
-
Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో ‘వీరాధి వీరులు’
-
Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? ‘జైలర్ 2’ తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!