AP Caste Census: రాజమండ్రిలో సమగ్ర కులగణన రౌండ్ టేబుల్ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Caste Census: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సమగ్ర కులగణన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ కె.మాధవిలత అధ్యక్షత వహించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, పూర్వపు ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న 5 జిల్లాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు హాజరయ్యారు.
కులగణన ఇదే మొదటి సారి: మంత్రి వేణుగోపాలకృష్ణ
కులగణన కాకపోవటం వల్ల రిజర్వేషన్ ఉన్నా ప్యాసింజర్లో ప్రయాణించవలసి వస్తుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయాలలో సమగ్ర న్యాయం జరగాలంటే కులగణన అవసరమన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కులగణన ఇదే మొదటి సారి అని.. 1988లో కేవలం జనగణన మాత్రమే జరిగిందన్నారు. కుల ఉద్యమాలకు కులగణనలో ఫలితం లభిస్తుందన్నారు. అందుకే సమావేశంలో కుల సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించామన్నారు.
Also Read
- Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
- Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
Also Read: Kakani Govardhan Reddy: పురంధేశ్వరికి నెల్లూరులో ఎన్ని కాలువలు ఉన్నాయో తెలీదు..
కులగణనతోనే సాధ్యం: ఎంపీ భరత్
ఇంతవరకు ఎప్పుడు కుల గణన జరగక పోవడం ప్రశ్నార్థకమని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. సమసమాజ స్థాపన కుల గణనతోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేశారన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు దేశవ్యాప్తంగా కులగణన జరగాలని పార్లమెంట్లో కొట్లాడుతామన్నారు. ఇకపై జనగణనతో పాటు కులగణనలు జరపాలని డిమాండ్ చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం అమలు జరగడానికి కుల గణన దోహదపడుతుందన్నారు. పలు సామాజిక వర్గాలకు రాజకీయ ఫలాలు అందడం లేదన్నారు. లెక్కలు ఉంటే ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవచ్చన్నారు.
తాజావార్తలు
-
Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
-
CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
-
Salman Khan: గెలాక్సీ అపార్ట్మెంట్స్కు సల్మాన్ ఖాన్ గుడ్ బై! ముంబయిని షేక్ చేస్తున్న ‘సుల్తాన్’ కొత్త ఇంటి రేటు!
-
Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
-
Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!