Fisher Men Missing: ఆ మత్స్యకారుల ఆచూకీ ఎక్కడ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారుల బోట్ కనిపించకుండా పోయింది. ఒకటి కాదు రెండు కాదు ఆరురోజులుగా నలుగురు మత్స్యాకారుల ఆచూకి లభించలేదు. సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి. దీంతో తమవారి పరిస్థితి ఏంటో అర్థం గాక మత్స్యకార కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు బోట్లతో పాటు ఒక హెలికాప్టర్,డోనార్క్ లైట్ తో గాలింపు కొనసాగించారు. మచిలీపట్నం నుండి మరో రొండు బొట్లు గాలింపు కోసం ప్రయాణం అయ్యాయి. డ్రోన్ కెమేరాలను సైతం సిద్ధం చేశారు అధికారులు.
Also Read
ఇదిలా వుంటే.. మచిలీపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి జాడలేని నలుగురు మత్సకారుల బోటు అంతర్వేదికి 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయినట్లు సమాచారం అందింది. అంతర్వేది వద్ద గాలించినా బోటు కనిపించలేదు. అంతర్వేది వద్ద కోస్ట్ గార్డ్ బృందాలు గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్ అధికారులు సమన్వయంతో గాలింపు చర్యలు వేగంగా సాగుతున్నాయి. మచిలీపట్నం నుంచి అంతర్వేది వరకూ ఉన్న తీరంలోజాడలేని మత్సకారుల కోసం గాలింపు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. మత్స్యకారుల జాడ కనిపించకపోవడంతో తోటి మత్స్యకారుల్లో ఆందోళన పెరుగుతోంది. వారి ఆరోగ్యం ఎలా వుంది, ఆహారం సరిపడా వుందా లేదా అనేది తేలాల్చి వుంది. అధికారులు మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..