CM Revath Reddy: త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా.. ఇలా కలుస్తాననుకోలేదు!
- సురవరం సుధాకర్రెడ్డి కన్నుమూత
- సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన సీఎం
- రాజీపడని జీవితం.. రాజీపడని సిద్ధాంతం
- సురవరం జ్ఞాపకార్థం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy Pays Tribute to Suravaram Sudhakar Reddy: పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజీపడని జీవితం, రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. బహుజనుల సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా మలుచుకున్న వారికి ఇది తీరని లోటు అన్నారు. తమ జిల్లాకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడు అని చెప్పారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణకు తీరని లోటన్నారు. త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా అని, ఇలా కలుస్తాననుకోలేదు అని సీఎం చెప్పారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి మఖ్దూం భవన్లో సీఎం రేవంత్ నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ‘బహుజనుల సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా మలుచుకున్న వాళ్ళకి తీరని లోటు. రాజీపడని జీవితం.. రాజీపడని సిద్ధాంతం ఆయనది. AISF నుంచి జాతీయ కార్యదర్శిగా.. ఏ హోదాలో పని చేసిన అహంకారం లేకుండా పని చేశారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నాకు లేఖ రాశారు. అసెంబ్లీలోనే లేఖను చదివి యూనివర్సిటీ పేరు మార్చాను. మా జిల్లాకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడు. ప్రజా సేవనే కాదు.. సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణకు తీరని లోటు. నిన్న జరిగిన PACలో కూడా వారిని స్మరించుకుని.. వారి సేవలను చర్చించుకున్నాం. త్వరలోనే నేను మీ ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పిన, కానీ ఇలా కలుస్తాను అనుకోలేదు. వారి జ్ఞాపకార్థం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాం, దీనిపై మంత్రివర్గంలో చర్చిస్తాం. తెలంగాణ మహనీయులను గుర్తించి వారి పేరు చిరస్థాయిగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని అన్నారు.
Also Read
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
Also Read: Medipally Murder: మీ తోటి కాకుంటే చెప్పుర్రి సార్.. ఆ నా కొడుకుని నేనే చంపేస్తా!
సీపీఐ దిగ్గజ నేత సురవరం సుధాకర్ రెడ్డి (83) గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో 1942 మార్చి 25న జన్మించిన సుధాకర్ రెడ్డికి సతీమణి విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు (నిఖిల్, కపిల్) ఉన్నారు. 1998, 2004 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా నుంచి ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. హిమాయత్ నగర్లోని సీపీఐ కార్యాలయం నుంచి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీగా వెళ్లి సురవరం భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నారు.
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!