CM Revath Reddy: త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా.. ఇలా కలుస్తాననుకోలేదు!
- సురవరం సుధాకర్రెడ్డి కన్నుమూత
- సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన సీఎం
- రాజీపడని జీవితం.. రాజీపడని సిద్ధాంతం
- సురవరం జ్ఞాపకార్థం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy Pays Tribute to Suravaram Sudhakar Reddy: పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజీపడని జీవితం, రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. బహుజనుల సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా మలుచుకున్న వారికి ఇది తీరని లోటు అన్నారు. తమ జిల్లాకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడు అని చెప్పారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణకు తీరని లోటన్నారు. త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా అని, ఇలా కలుస్తాననుకోలేదు అని సీఎం చెప్పారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి మఖ్దూం భవన్లో సీఎం రేవంత్ నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ‘బహుజనుల సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా మలుచుకున్న వాళ్ళకి తీరని లోటు. రాజీపడని జీవితం.. రాజీపడని సిద్ధాంతం ఆయనది. AISF నుంచి జాతీయ కార్యదర్శిగా.. ఏ హోదాలో పని చేసిన అహంకారం లేకుండా పని చేశారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నాకు లేఖ రాశారు. అసెంబ్లీలోనే లేఖను చదివి యూనివర్సిటీ పేరు మార్చాను. మా జిల్లాకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడు. ప్రజా సేవనే కాదు.. సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణకు తీరని లోటు. నిన్న జరిగిన PACలో కూడా వారిని స్మరించుకుని.. వారి సేవలను చర్చించుకున్నాం. త్వరలోనే నేను మీ ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పిన, కానీ ఇలా కలుస్తాను అనుకోలేదు. వారి జ్ఞాపకార్థం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాం, దీనిపై మంత్రివర్గంలో చర్చిస్తాం. తెలంగాణ మహనీయులను గుర్తించి వారి పేరు చిరస్థాయిగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని అన్నారు.
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
Also Read: Medipally Murder: మీ తోటి కాకుంటే చెప్పుర్రి సార్.. ఆ నా కొడుకుని నేనే చంపేస్తా!
సీపీఐ దిగ్గజ నేత సురవరం సుధాకర్ రెడ్డి (83) గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో 1942 మార్చి 25న జన్మించిన సుధాకర్ రెడ్డికి సతీమణి విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు (నిఖిల్, కపిల్) ఉన్నారు. 1998, 2004 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా నుంచి ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. హిమాయత్ నగర్లోని సీపీఐ కార్యాలయం నుంచి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీగా వెళ్లి సురవరం భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!