CM Revanth Reddy: నల్లమలలో పెరిగిన పులులు, తోడేళ్లు చూశా.. మీ కుట్రలు ఎంత?
- మహబూబ్నగర్ ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోడీ సిద్ధమా అంటూ సవాల్
- కేసీఆర్, కేటీఆర్ పరిశ్రమలు అడ్డుకుని ఫాంహౌస్కు పోతారని వ్యాఖ్యలు
CM Revanth Reddy: రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోడీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్నగర్లో జరుగుతున్న ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
Read Also: CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటాలను దక్కించుకోవాలి.. సీఎం ఆదేశం
Also Read
- Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం, సాగర్ కట్టేవాళ్లా అంటూ చెప్పుకొచ్చారు. విపక్షాల ఉచ్చులో పడొద్దన్నారు. కుటుంబాలను నాశనం చేసుకోవద్దన్నారు. మహబూబ్నగర్ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ పరిశ్రమలు అడ్డుకుని ఫాంహౌస్కు పోతారని విమర్శించారు. రైతు కష్టం నాకు తెలియదా అంటూ పేర్కొన్నారు. కొడంగల్లో పారిశ్రామిక పార్కులు నిర్మించి ఉద్యోగాలు తేవాలని తాను అనుకున్నానన్నారు. కానీ, లగచర్లలో గొడవ చేసి మంట పెట్టారన్నారు. బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి గిరిజనులు జైళ్లకు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కుట్రలు, కుతంత్రాలు సాగనివ్వను.. కొడంగల్లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. 25 వేల ఉద్యోగాలు తీసుకొస్తామన్నారు. నల్లమలలో పుట్టి పెరిగా.. మీ లాంటి గుంట నక్కలకు భయపడనన్నారు. పాలమూరు వాళ్లకు పని చేయడమే తెలుసు.. గొప్పలు చెప్పుకోరన్నారు. రైతులే మా బ్రాండ్ అంబాసిడర్లు అంటూ సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: Telangana: పంట రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
వరి వేస్తే ఉరి కేసీఆర్ అన్నాడని.. ఇప్పుడూ వరి వేస్తే ఇప్పుడు బోనస్ ఇస్తున్నామన్నారు. వరి వేస్తే బోనస్ ఇస్తుంటే.. మూడు రోజుల్లో డబ్బులు పడుతుంటే బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నాయన్నారు. ఐదేళ్లలో మొదటి ఏడాదిలో మాఫీ చేయకపోవడంతో మీరు చేసిన మాఫీ వడ్డీకే మిగిలిందని విమర్శించారు. ఒక్క రోజే 18 వేల కోట్లు రైతులకు మాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కాళేశ్వరం కడిగితే లక్ష 20 వేల కోట్లు పెట్టారని.. కాళేశ్వరం కుప్పకూలిందని సీఎం విమర్శించారు. మేము కట్టిన నాగార్జున సాగర్.. ఎల్లంపల్లి ఎట్లా ఉన్నాయి చూడాలన్నారు. మంత్రులపై సీఎం సెటైర్లు వేశారు. ఉత్తమ్ పాలమూరు అల్లుడు.. అల్లుడిగా రుణం తీర్చుకోవాలి అని రేవంత్ అన్నారు. మల్లు వారిది పాలమూరే.. 100 ఖర్చు ఐతే 50 రాసుకుంటం.. విరివిగా నిధులు ఇవ్వండి అంటూ భట్టికి విజ్ఞప్తి చేశారు. దామోదర రాజనర్సింహ.. చెప్పింది కాదని అనడు.. అందుకే ఇంచార్జి మంత్రిగా పెట్టుకున్నా అని చెప్పారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో