Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Revanth Reddy Severely Criticized The Bjp At The India Today Conclave

CM Revanth Reddy: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది..

Published Date :March 7, 2025 , 6:37 pm
By Rajesh Veeramalla
  • 3 నెలల్లో రూ.21 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసింది మా ప్రభుత్వమే- రేవంత్ రెడ్డి
  • డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది- సీఎం
  • సౌత్‌ ప్రాతినిధ్యం తగ్గించే పనిలో బీజేపీ ఉంది- సీఎం రేవంత్‌రెడ్డి.
CM Revanth Reddy: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలువురు ముఖ్య నేతలను కలవనున్నారు. మరోవైపు.. “ఇండియా టుడే” మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. మీరు కన్ఫ్యూజ్ అయినట్టే మేము మూడు లక్షల కోట్లే అప్పు అనుకున్నాం.. కానీ లెక్కలు చూస్తే రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని అన్నారు. కేసీఆర్ మూడు లక్షల కోట్ల అప్పే అని చెప్పారన్నారు. తెలంగాణలో 21 వేల కోట్లు రైతులకు రుణమాఫీ.. మూడు నెలల్లో చేసింది తమ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. సౌత్ ప్రాతినిధ్యం తగ్గించే పనిలో బీజేపీ ఉందని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణకు సౌత్ ఇండియా ప్రజలు కట్టుబడి ఉన్నారు.. ఇప్పుడు జనాభా ప్రకారం నియోజక వర్గాల విభజన అంటే ఎలా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: Karnataka Budget: ఆధునిక “ముస్లిం లీగ్” బడ్జెట్.. కర్ణాటక బడ్జెట్‌పై బీజేపీ విమర్శలు..

Also Read

  • Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
  • Astrology: ఏప్రిల్‌ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

మోడీ జన గణన చేస్తున్నారు.. దాంట్లో కుల గణన కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తాం అంటున్నామని చెప్పారు. మరోవైపు.. భాషను బలవంతంగా రుద్దొద్దని సూచించారు. ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ.. రెండో భాష తెలుగు అని చెప్పారు. సివిల్స్‌లో తెలుగుని తొలగించారని తెలిపారు. కాంగ్రెస్ కు యూత్ కాంగ్రెస్.. మహిళా కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఉన్నాయని వెల్లడించారు. కానీ మోడీకి ఈడీ, సీబీఐ, ఇన్‌కం టాక్స్‌లు అనుబంధ సంఘాలని విమర్శించారు.

Read Also: #Viral Prapancham Review: #వైరల్ ప్రపంచం రివ్యూ

కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఎక్కువ.. అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి వాళ్లను పక్కన పెడితే సైలెంట్‌గా ఉన్నారు.. తమ పార్టీలో రాజ్యసభ సీటు ఒక్కసారి ఇవ్వకపోతే జంతర మంతర్ లో ధర్నా చేస్తారు.. అంత ప్రజాస్వామ్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలోనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీలో అది సాధ్యమేనా అని అన్నారు. అదానీ 100 కోట్లు వెనక్కి ఇవ్వాలని పార్టీ చెప్పలేదు.. తాను భద్రాచలంలో రాముడి గుడి ఉందని చెప్పా.. మోడీ, అమిత్ షాలను పిలిచా ఇప్పటి వరకు రాలేదన్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లో ఒలంపిక్స్ నిర్వహించండి అని తాను లేఖ రాశానని తెలిపారు. అహ్మదాబాద్ కంటే తమ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BJP Criticism
  • bjp vs congress
  • CM Revanth Reddy
  • Delhi

తాజావార్తలు

  • Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్

  • Astrology: ఏప్రిల్‌ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!

  • LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్‌లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions