CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఇందిరమ్మ ఇళ్లపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి పలు అంశాలపై చర్చ
CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
Read Also: MLC Kavitha: ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్షకు బయలుదేరిన రోజు ఇది..
Also Read
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు ఈ పథకం అమలుకు సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.సమగ్ర కుటుంబ సర్వే పూర్తి అయిన తరువాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని మంత్రులు, అధికారులు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు అందాయి. గ్రామసభల ద్వారా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోది.
ప్ర ఇళ్ల నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల చొప్పున నిధులను సర్కారు విడుదల చేస్తుంది. ఐదేళ్లలో రూ.28 వేల కోట్లతో 20 లక్షలకుపైగా ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో రూ.7,740 కోట్ల వ్యయంతో గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. స్థలం లేనివారికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇళ్లు మంజూరు చేయాడానికి ప్రభుత్వx భావిస్తోంది. అవసరమైతే ప్రభుత్వమే స్థలం సమకూర్చే విధంగా చర్యలు చేపడుతోంది.
తాజావార్తలు
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో