PM Modi: పేదోడికి ఇల్లు ఉండాలన్నదే తన కల.. ఢిల్లీ ఎన్నికల్లో మోడీ వ్యాఖ్య
- పేదోడికి ఇల్లు ఉండాలన్నదే తన కల
- ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ వ్యాఖ్య
ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్నదే తన కల అని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వారకా ప్రాంతంలో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనకు సొంతిల్లు లేదని.. పేదోడికి మాత్రం ఇల్లు ఉండాలన్నది తన కల అని చెప్పారు. ఢిల్లీలో పేదల కోసం కేంద్రం నిర్మించిన ఇళ్లను ఆప్ కేటాయించడం లేదని… కోట్ల రూపాయలతో శీష్మహల్ను నిర్మించుకున్నవారికి పేదల బాధ అర్థంకాదని ధ్వజమెత్తారు. పేదల సొంతింటి కల నెరవేరాలంటే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి దేశ రాజధాని ఆప్కు ఏటీఎంలా మారిందని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Economic Survey 2024-25: భారీ లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు.. ఉద్యోగుల నోట్లో మట్టి!
Also Read
ఢిల్లీలో ఉన్న మహిళలంతా బ్యాంక్ ఖాతాతో ఫోన్ నెంబర్ లింక్ చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఖాతాలో డబ్బు జమ అయిన సందేశాన్ని అందుకుంటారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశంలో మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,500 పథకంపై నిర్ణయం ఉంటుందని మోడీ స్పష్టం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
#DelhiElection2025 | Prime Minister Narendra Modi addresses a public meeting in Delhi's Dwarka area, says, "I would ask all the women in Delhi to link their phone number with their bank account so that they could receive the message that money has been credited to their account… pic.twitter.com/qtCUHmAOmK
— ANI (@ANI) January 31, 2025
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో