CM KCR : మాయ మాటలు చెప్పే వాళ్ళు వస్తారు.. తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరో గుర్తు పెట్టుకోవాలి
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆయా పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నేడు మేడ్చల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పే వాళ్ళు వస్తారని, తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు గుర్తు పెట్టుకోవాలన్నారు. అందరూ బీఆర్ఎస్కి అండగా ఉండాలని ఆయన కోరారు. కాంగ్రెస్ హయాంలో అంతా కరెంటు కోతలేనని, కాళేశ్వరం, పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్ట్లతో నీటి సమస్య పోయిందన్నారు. మేడ్చల్తో పాటు పలు నియోజకవర్గాలు మిని భారత్ లాంటివని, హైదరాబాద్ పరిసరాల్లో ఉండే నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి బీమా సదుపాయం అని మేనిఫెస్టోలో పెట్టుకున్నామన్నారు అధికారంలోకి వచ్చిన తరవాత మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి స్కీం అమలు చేస్తామన్నారు. మేడ్చల్ నియోజకవర్గంను మోసే శక్తి మల్లారెడ్డికి మాత్రమే ఉందని, మేడ్చల్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఒక్క మేడ్చల్లోనే తాగునీటి కోసం ప్రభుత్వం రూ.350 కోట్లు ఖర్చు చేసిందని, 26వేలు, 2బీహెచ్కే ఇళ్లను పంపిణీ చేసిందని, హైదరాబాద్లో మరో లక్ష ఇళ్లను ఉచితంగా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైందని ముఖ్యమంత్రి తెలిపారు. “మేము ప్రారంభించిన అభివృద్ధి కొనసాగాలి. ఎందుకంటే ఐదు దశాబ్దాలుగా మనల్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇతరులు మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులలా చూసుకున్నారు’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సవాల్ విసిరినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. 1956లో మా నాయకులు చేసిన చిన్న పొరపాటు దశాబ్దాలుగా మనల్ని వెంటాడుతోంది’’ అని కేసీఆర్ ఎత్తిచూపారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే తప్పుడు వాగ్దానాలపై మేడ్చల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
- Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
- Mamata Banerjee: "ఇక మనం జాగ్రత్తగా ఉండాలి".. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
తాజావార్తలు
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
-
Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!