CM KCR : మాయ మాటలు చెప్పే వాళ్ళు వస్తారు.. తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరో గుర్తు పెట్టుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆయా పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నేడు మేడ్చల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పే వాళ్ళు వస్తారని, తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు గుర్తు పెట్టుకోవాలన్నారు. అందరూ బీఆర్ఎస్కి అండగా ఉండాలని ఆయన కోరారు. కాంగ్రెస్ హయాంలో అంతా కరెంటు కోతలేనని, కాళేశ్వరం, పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్ట్లతో నీటి సమస్య పోయిందన్నారు. మేడ్చల్తో పాటు పలు నియోజకవర్గాలు మిని భారత్ లాంటివని, హైదరాబాద్ పరిసరాల్లో ఉండే నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి బీమా సదుపాయం అని మేనిఫెస్టోలో పెట్టుకున్నామన్నారు అధికారంలోకి వచ్చిన తరవాత మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి స్కీం అమలు చేస్తామన్నారు. మేడ్చల్ నియోజకవర్గంను మోసే శక్తి మల్లారెడ్డికి మాత్రమే ఉందని, మేడ్చల్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఒక్క మేడ్చల్లోనే తాగునీటి కోసం ప్రభుత్వం రూ.350 కోట్లు ఖర్చు చేసిందని, 26వేలు, 2బీహెచ్కే ఇళ్లను పంపిణీ చేసిందని, హైదరాబాద్లో మరో లక్ష ఇళ్లను ఉచితంగా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైందని ముఖ్యమంత్రి తెలిపారు. “మేము ప్రారంభించిన అభివృద్ధి కొనసాగాలి. ఎందుకంటే ఐదు దశాబ్దాలుగా మనల్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇతరులు మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులలా చూసుకున్నారు’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సవాల్ విసిరినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. 1956లో మా నాయకులు చేసిన చిన్న పొరపాటు దశాబ్దాలుగా మనల్ని వెంటాడుతోంది’’ అని కేసీఆర్ ఎత్తిచూపారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే తప్పుడు వాగ్దానాలపై మేడ్చల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
తాజావార్తలు
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!