CM KCR : మాయ మాటలు చెప్పే వాళ్ళు వస్తారు.. తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరో గుర్తు పెట్టుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆయా పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నేడు మేడ్చల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పే వాళ్ళు వస్తారని, తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు గుర్తు పెట్టుకోవాలన్నారు. అందరూ బీఆర్ఎస్కి అండగా ఉండాలని ఆయన కోరారు. కాంగ్రెస్ హయాంలో అంతా కరెంటు కోతలేనని, కాళేశ్వరం, పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్ట్లతో నీటి సమస్య పోయిందన్నారు. మేడ్చల్తో పాటు పలు నియోజకవర్గాలు మిని భారత్ లాంటివని, హైదరాబాద్ పరిసరాల్లో ఉండే నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి బీమా సదుపాయం అని మేనిఫెస్టోలో పెట్టుకున్నామన్నారు అధికారంలోకి వచ్చిన తరవాత మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి స్కీం అమలు చేస్తామన్నారు. మేడ్చల్ నియోజకవర్గంను మోసే శక్తి మల్లారెడ్డికి మాత్రమే ఉందని, మేడ్చల్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఒక్క మేడ్చల్లోనే తాగునీటి కోసం ప్రభుత్వం రూ.350 కోట్లు ఖర్చు చేసిందని, 26వేలు, 2బీహెచ్కే ఇళ్లను పంపిణీ చేసిందని, హైదరాబాద్లో మరో లక్ష ఇళ్లను ఉచితంగా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైందని ముఖ్యమంత్రి తెలిపారు. “మేము ప్రారంభించిన అభివృద్ధి కొనసాగాలి. ఎందుకంటే ఐదు దశాబ్దాలుగా మనల్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇతరులు మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులలా చూసుకున్నారు’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సవాల్ విసిరినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. 1956లో మా నాయకులు చేసిన చిన్న పొరపాటు దశాబ్దాలుగా మనల్ని వెంటాడుతోంది’’ అని కేసీఆర్ ఎత్తిచూపారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే తప్పుడు వాగ్దానాలపై మేడ్చల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!