CM KCR : మునుగోడులో గోల్మాల్ ఉప ఎన్నిక వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Adressed At Munugodu Praja divena Sabha
ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. దీంతో.. రాష్ట్ర రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో నేడు మునుగోడు ప్రజా దీవెన పేరుతో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మంచినీళ్లు తెచ్చుకున్నం.. కొంత బాధ పోయింది. ఇక.. సాగు నీళ్లు రావాలంటే.. నల్లగొండ ఉండేదే కృష్ణ బేసిన్లో.. అయితే.. డిండి ద్వారా రావాలే.. అలా రావాలంటే.. శివన్నగూడెం ప్రాజెక్ట్ ద్వారా రావాలే.. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి తీసుకొని లిఫ్ట్ ద్వారా నింపుకోవాలే. దాని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాం. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు. మనం చేతుల్లో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పజెప్పి.. ఎవరినో పోరాటం చేయమంటే చేయరు. ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. ప్రజలు దగ్గర ఉండే ఒకే ఆయుధం ఓటు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
CM KCR : ఒకనాడు ఫ్లొరైడ్ నీళ్లతోని, నడుములు వంగిపోయి.. ఇవాళ్ల జీరో ఫ్లొరైడ్
దాని ద్వారా నిర్మాణమయ్యే శక్తి మనకు ఉపయోగపడుతదా.. పడదా.. ఆలోచించి ఓటు వేయాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలి. ఆ చర్చలో భాగంగానే ఈ రోజు దేశంలో జరిగేటువంటి వ్యవహారాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు, సమాజాన్ని చీల్చి చెండాడే విద్వేష విధానాలకు పోరాటం జరుగవలసిని అవసరం ఉందని.. జాతీయ, రాష్ట్ర స్థాయి కమ్యూనిస్టు, ఇతర పార్టీ నాయకులతో నేను చర్చలు జరుపుతున్నా. ఈ దేశాన్ని ప్రజలను ఏవిధంగా కాపాడుకోవాలని ఐదారు నెలలుగా ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఏవిధంగా మునుగోడులో గోల్మాల్ ఉప ఎన్నిక వచ్చిందో మీకు తెలుసు. ఏం అవసరం ఉండి వచ్చింది ఎన్నిక ఇక్కడా..? ఇంకో సంవత్సరం అయితే ఎన్నికలే ఉండే.. ఇప్పుడు ఈ ఎన్నిక తీసుకువచ్చి ఎవ్వరిని ఉద్ధరించడానికి..? ఎవరి సంక్షేమం కోరి.. ఎవరి మంచి కోరి.. ఈ ఉప ఎన్నిక తీసుకువచ్చారు. ఈ ఉప ఎన్నిక వెనుకున్న మాయ మచ్చీంద్ర గుర్తు పట్టకపోతే.. దెబ్బతినే ప్రమాదం ఉంది’ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!