CM KCR : ఒకనాడు ఫ్లొరైడ్ నీళ్లతోని, నడుములు వంగిపోయి.. ఇవాళ్ల జీరో ఫ్లొరైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Speech At Munugodu Praja Divena Sabha
ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. దీంతో.. రాష్ట్ర రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో నేడు మునుగోడు ప్రజా దీవెన పేరుతో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గం ఒకనాడు ఫ్లొరైడ్ నీళ్లతోని, నడుములు వంగిపోయి, ఏ విధంగా బాధపడ్డదో నేను మీకు చెప్పఅవసరం లేదు. కేసీఆర్ కన్న ముందు.. కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్లు, కేసీఆర్కన్నా ఎత్తునోళ్లు ఎంతో మంది ముఖ్యమంత్రులయ్యారు. అంశాల స్వామి అనే వ్యక్తిని తీసుకువెళ్లి.. ఆనాడు ఇదే జిల్లా బిడ్డ దుచ్చర్ల సత్యనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి జలసాధన కోసంపోరాటం చేసి.. ఆనాడు ఉన్నటువంటి ప్రధానిమంత్రి టేబుల్ మీద మా బతుకు ఇది అని అంటే.. ఎవ్వరూ కూడా మన మొర వినలే. ఆ తరువాత నేనే వచ్చి తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తరువాత రాష్ట్రామంతా మీ బాధ చెప్పుతూ వచ్చాను. దేశంతో పాటు విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి బాధవ్యక్తం చేశారు. అయితే.. సమస్య పరిష్కారం చేయండని వారికి చెప్పాం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నల్లగొండ నగారా అనే పేరుతో 15 రోజుల పాటు నేను సైతం జిల్లా తిరిగి ఫ్లొరైడ్ బాధలపై చైతన్యం పరచడం జరిగింది.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
శివన్నగూడెం గ్రామంలో నేను నిద్రకూడా చేయడం జరిగింది. ‘ఏమాయానే.. నల్లగొండ’ అనే మాటకూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అనేక ప్రభుత్వాలు, పార్టీలు, రాజకీయాల తరువాత.. మనందరి పోరాట ఫలితంగా మన తెలంగాణ మనకు వస్తే.. ఇవాళ్ల జీరో ఫ్లొరైడ్.. ఫ్లొరైడ్ రహిత మునుగోడుగా.. ఫ్లొరైడ్ రహిత నల్లగొండగా మనం మార్చుకున్నం. మిషన్ భగీరథతోని ఆ సత్యం మీముందే ఉందని నేను మనవి చేస్తున్నా. ఒక సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో).. నల్లగొండ జిల్లాలో సరైన ప్రయత్నాలు జరుగకుంటే.. మానవ నివాస యోగం కాకుండా పోతది. ఇక్కడ మనుషులు నివసించలేరు. ఇక్కడ మంచినీళ్లు పైపుల ద్వారా ఇవ్వాలే.. శుద్ధి చేసిన నీళ్లు ఇవ్వాలే.. పొలాలకు కూడా పండించే పంటలకు ఫ్లొరైడ్ ఎక్కుతా ఉన్నది. కల్లు ఇచ్చే తాటి చెట్లకు కూడా ఫ్లొరైడ్ ఎక్కుతా ఉన్నది. ఇక్కడ పండించే పంటలు తింటే కూడా ప్రమాదానికి దారితీస్తదని డబ్ల్యూహెచ్వో చెప్పితేకూడా ఆనాడు రాష్ట్ర పాలకులు, కేంద్ర పాలకులు పట్టించుకోలే అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!