CM Jagan : కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ రోడ్డు ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్లో బెంగళూరు-హైదరాబాద్ (ఎన్హెచ్ 44)లో గురువారం నాడు నిలిచిన ట్యాంకర్ను వారు ప్రయాణిస్తున్న ఎస్యూవీ ఢీకొనడంతో పదమూడు మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు చిక్కబళ్లాపూర్ పోలీసు అధికారి నగేష్ తెలిపారు. ఇది కూడా చదవండి – స్కిల్ స్కామ్: చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది దసరా పండుగను పురస్కరించుకుని వలస కూలీలంతా స్వగ్రామాలకు వెళ్లారు. బాగేపల్లి నుంచి బెంగళూరులోని హొంగసంద్రకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపక్కన నిలిచిన ట్యాంకర్ను గమనించలేకపోయిన నరసింహులు అనే ఎస్యూవీ డ్రైవర్ దానిని ఢీకొట్టాడు.
Also Read : Mehreen Pirzada: చీరకట్టులో మురిపిస్తున్న మెహ్రీన్ పిర్జాదా..
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
ఘటన జరిగినప్పుడు ఎస్యూవీలో 14 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది చిక్కబళ్లాపూర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న చిక్కబళ్లాపూర్లోని పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసిందన్నారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నామన్నారు.
Also Read : Stock Market Crash: మార్కెట్లో భారీ పతనం.. ఇన్వెస్టర్లకు రూ.18లక్షల కోట్ల నష్టం
తాజావార్తలు
-
Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
-
Virat Kohli: ఈరోజు నా కల నిజమైంది.. ఈ విజయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. కింగ్ కోహ్లీ భావోద్వేగం!
-
DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
-
RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!