CM Jagan : కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ రోడ్డు ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్లో బెంగళూరు-హైదరాబాద్ (ఎన్హెచ్ 44)లో గురువారం నాడు నిలిచిన ట్యాంకర్ను వారు ప్రయాణిస్తున్న ఎస్యూవీ ఢీకొనడంతో పదమూడు మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు చిక్కబళ్లాపూర్ పోలీసు అధికారి నగేష్ తెలిపారు. ఇది కూడా చదవండి – స్కిల్ స్కామ్: చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది దసరా పండుగను పురస్కరించుకుని వలస కూలీలంతా స్వగ్రామాలకు వెళ్లారు. బాగేపల్లి నుంచి బెంగళూరులోని హొంగసంద్రకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపక్కన నిలిచిన ట్యాంకర్ను గమనించలేకపోయిన నరసింహులు అనే ఎస్యూవీ డ్రైవర్ దానిని ఢీకొట్టాడు.
Also Read : Mehreen Pirzada: చీరకట్టులో మురిపిస్తున్న మెహ్రీన్ పిర్జాదా..
Also Read
- Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
- Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
- Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
ఘటన జరిగినప్పుడు ఎస్యూవీలో 14 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది చిక్కబళ్లాపూర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న చిక్కబళ్లాపూర్లోని పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసిందన్నారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నామన్నారు.
Also Read : Stock Market Crash: మార్కెట్లో భారీ పతనం.. ఇన్వెస్టర్లకు రూ.18లక్షల కోట్ల నష్టం
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షా కాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి.. బ్యాడ్ స్మెల్ కూడా రాదు!
-
Astrology: ఉదయం లేవగానే ఈ 3 రాశులవారు చేసే అలవాట్లు.. విజయానికి అదే కారణమా?
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!