CM Jagan : కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ రోడ్డు ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్లో బెంగళూరు-హైదరాబాద్ (ఎన్హెచ్ 44)లో గురువారం నాడు నిలిచిన ట్యాంకర్ను వారు ప్రయాణిస్తున్న ఎస్యూవీ ఢీకొనడంతో పదమూడు మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు చిక్కబళ్లాపూర్ పోలీసు అధికారి నగేష్ తెలిపారు. ఇది కూడా చదవండి – స్కిల్ స్కామ్: చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది దసరా పండుగను పురస్కరించుకుని వలస కూలీలంతా స్వగ్రామాలకు వెళ్లారు. బాగేపల్లి నుంచి బెంగళూరులోని హొంగసంద్రకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపక్కన నిలిచిన ట్యాంకర్ను గమనించలేకపోయిన నరసింహులు అనే ఎస్యూవీ డ్రైవర్ దానిని ఢీకొట్టాడు.
Also Read : Mehreen Pirzada: చీరకట్టులో మురిపిస్తున్న మెహ్రీన్ పిర్జాదా..
Also Read
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
- ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
ఘటన జరిగినప్పుడు ఎస్యూవీలో 14 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది చిక్కబళ్లాపూర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న చిక్కబళ్లాపూర్లోని పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసిందన్నారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నామన్నారు.
Also Read : Stock Market Crash: మార్కెట్లో భారీ పతనం.. ఇన్వెస్టర్లకు రూ.18లక్షల కోట్ల నష్టం
తాజావార్తలు
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
-
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..