CM Chandrababu : ఇలా చేస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది.. హత్యలు చేస్తే కాదు?
- స్వచ్ఛ భారత్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యం
- ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి
- ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించవచ్చు
- సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
స్వచ్ఛ భారత్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యమైన అవసరమని.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఆ తర్వాత మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. “ప్రతి నెల మూడవ శనివారం ఏ పని అవసరం లేదు.. మనల్ని మనం బాగు చేసుకోవాలి. పర్యాటకులు మోసం చేస్తే రారు, పరిశుభ్రంగా లేకుంటే రారు, హత్యలు చెస్తే రారు.. పరిశుభ్రంగా ఉంటే పర్యాటకులు వస్తారు. ప్రతి ఇంటి వద్ద చెత్త కలెక్ట్ చేశారా లేదా అనేదానికి క్యూఆర్ కోడ్ పెడతాం. పొడి తడి చెత్తలను వేరువేరుగా కలెక్ట్ చేస్తాం. చెత్త నుంచి ఆదాయం పొందడంపై అందరూ దృష్టి సారించాలి. చెత్త నుంచి విద్యుత్ బయోగ్యాస్ వంటివి తయారు చేయవచ్చు. ఇది నాకు నచ్చిన పని నేను మనసుపెట్టి పని చేస్తా. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 2025 అక్టోబర్ లోపల ఇది పూర్తి చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఒకపక్క గాలి కలుషితం అవుతోంది, మరోపక్క తాగే నీరు కలుషితం అవుతోంది” అని సీఎం తెలిపారు.
READ MORE: Samsung Galaxy M35 5G: రూ. 24 వేల సామ్సంగ్ ఫోన్.. రూ. 14 వేలకే.. మతిపోయే ఫీచర్లు
Also Read
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
ఇంటింటికి వెళ్లి చత్త సేకరణ చేపట్టాలని మున్సిపల్ పరిపాలన విభాగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. “భారతదేశం మొత్తం స్వచ్ఛభారతవైపు అడుగులు వేస్తోంది మనం మొదటి స్థానంలో ఉండాలి. నేను ఎక్కడికి వచ్చి వెళ్లినా మార్పు కనపడాలి. అదే సిబీఎన్ మార్క్. మీ ఇంటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకోండి. సోలార్ ప్లాంట్ మీ ఇళ్లపై నిర్మించుకుంటే భారీగా సబ్సిడీ ఇస్తా..
విద్యుత్ వాడకం వల్ల పెట్రోల్ భారం తగ్గుతుంది.. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి కృషి చేస్తా. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన సబ్సిడీ ఇస్తా. ఇంటర్నెట్ పెట్టుకోవాలి. రాబోవు రోజుల్లో మీ సెల్ ఫోన్ నుంచి ఏ పని కావాలన్నా వాట్సప్ గవర్ననెన్స్ తీసుకొస్తున్న… వాట్సప్ ద్వారా మీ ఇంటి వద్ద నుంచే మీకు సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్న.. మైదుకూరులో వీధిలైట్లు ఏర్పాటు చేస్తాం. మైదుకూరును ఓ మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతా. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయితే రౌడీలదే రాజ్యమవుతుంది. అలాంటి రౌడీలు రాకూడదనే నా కోరిక. కడపలో ముఠాలు లేకుండా చేసాం. ప్రజా చైతన్యం పెరిగితే మెరుగైన ఫలితాలు వస్తాయి.” అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?